Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 68.10 పాయింట్లు నష్టపోయి 19,674.25 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకొని మధ్యాహ్నం ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. అమ్మకాల ఒత్తిడితో చివరకు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ప్రభావం మార్కెట్లలో కనిపించింది. భారత్, కెనడా మధ్య పరిణామాలు, జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్ల బాండ్ ఇండెక్స్లో భారత్ చేరనుండడం వంటి అంశాలు దేశీయ సూచీలపై మిశ్రమ ప్రభావం చూపాయి.
ఉదయం సెన్సెక్స్ (Sensex) 66,215.04 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,952.83 వద్ద కనిష్ఠాన్ని, 66,445.47 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,744.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,798.65 వద్ద గరిష్ఠాన్ని, 19,657.50 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 68.10 పాయింట్లు నష్టపోయి 19,674.25 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.95 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్గ్రిడ్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, టైటన్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ జెన్ టెక్నాలజీస్కు భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.227.65 కోట్లు విలువ చేసే ఆర్డర్ లభించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 5 శాతం పెరిగి రూ.730.90 దగ్గర స్థిరపడింది.
☛ భవిష్యత్లో బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో హడ్కో షేర్లు గతకొన్ని రోజులుగా రాణిస్తున్నాయి. ఇంట్రాడేలో ఈ షేరు ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకింది. ఏప్రిల్ నుంచి ఈ షేరు ఏకంగా 95 శాతం పుంజుకోవడం విశేషం. ఈరోజు చివరకు షేరు విలువ 18.01 శాతం పెరిగి రూ.85.20 దగ్గర ముగిసింది.
☛ లక్స్ ఇండస్ట్రీస్ రూ.200 కోట్లు పన్ను ఎగవేసినట్లు.. దీనిపై ఆదాయ పన్ను విభాగం సోదాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎక్స్ఛేంజీలు కంపెనీని వివరణ కోరాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు 3.02 శాతం నష్టపోయి రూ.1,473.50 దగ్గర నిలిచింది.
☛ భారత ప్రభుత్వ బాండ్లు జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్స్లో చేరనున్న నేపథ్యంలో పీఎన్బీ గిల్ట్స్ షేరు ఈరోజు 20 శాతం పెరిగి రూ.81.60 అప్పర్ సర్క్యూట్ని తాకి అక్కడే స్థిరపడింది.
☛ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్లో 75 శాతం విక్రయించనున్న నేపథ్యంలో గ్లెన్మార్క్ ఫార్మా షేరు ఈరోజు ఇంట్రాడేలో 6 శాతం నష్టపోయింది. చిరవకు 2.98 శాతం నష్టపోయి రూ.803.05 దగ్గర ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధిరేటు అంచనా 7 %
వరుసగా అయిదో ద్వైమాసిక సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. -
చక్కెర మిల్లులపై అంబానీ దృష్టి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా చక్కెర మిల్లులపై దృష్టి సారించిందని వార్తలొస్తున్నాయి. -
షేర్లు కొన్న రోజే సెటిల్మెంట్!
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదే రోజు సెటిల్మెంట్ చేసే ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నామని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్ తెలిపారు. -
నిఫ్టీ @ 21,000
గురువారం నాటి నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, శుక్రవారం సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 70,000 పాయింట్లకు చేరువ కాగా.. నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి ఇంట్రాడేలో 21,000 పాయింట్లను అధిగమించింది. -
ఈక్విటీ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి గత నెలలో నికరంగా రూ.15,536 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్లు భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) వెల్లడించింది. -
పర్యావరణం, సమాజానికి చేయూత అందించాలి
పర్యావరణానికి మేలు చేసేలా, సమాజాభివృద్ధికి ఉపకరించే సానుకూల దృక్పథంతో కంపెనీలు వ్యవహరించాలని విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. -
వరద ప్రభావిత వినియోగదార్లకు అత్యవసర సేవాకేంద్రం: ఎస్బీఐ జనరల్
తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న తమిళనాడు వినియోగదార్లకు సేవలు అందించేందుకు అత్యవసర సేవా కేంద్రాన్ని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. -
ఐఫోన్ కొత్త ప్లాంట్కు టాటాల సన్నాహాలు
దేశంలో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. -
ఓటీటీ ఆదాయాల్లో ఏటా 25% వృద్ధి
భారత్లో ఓటీటీ (ఓవర్-ద-టాప్) వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని నెట్ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
మన దేశానికి స్వాతంత్య్రం లభించి శతాబ్ది కాలం పూర్తయ్యే 2047కు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోహ్రి శుక్రవారం వెల్లడించారు. -
YouTube: యూట్యూబ్లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
YouTube: కంటెంట్ క్రియేటర్లకు వారి కామెంట్ సెక్షన్పై మరింత నియంత్రణ కల్పించేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. -
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్
boAt Lunar Pro LTE: ఇ-సిమ్ సపోర్ట్తో బోట్ తొలి స్మార్ట్వాచ్ తీసుకొస్తోంది. అంటే కాల్స్, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్ఫోన్ అక్కర్లేదు.


తాజా వార్తలు (Latest News)
-
పొరపాటున పేలిన ఎస్.ఐ. తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా
-
Anganwadi Vacancy: తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
-
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
-
డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్.. నాలుగో అంతస్తు నుంచి పడి కొరియర్ బాయ్ మృతి
-
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి
-
సివిల్స్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు!