Stock market investment: లాభార్జనకు వ్యూహాలివీ..
మార్కెట్లో కొన్ని నెలలుగా దిద్దుబాటు చోటు చేసుకోవడం చూస్తున్నాం. పెట్టుబడి పెట్టేవారు ఇలాంటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మార్కెట్ పయనం ఎటువైపున్నా.. ఆయా దశల్లో మదుపు చేసి, లాభాలను సంపాదించేందుకు సరైన వ్యూహాల్ని, క్రమశిక్షణతో ఆచరించాలి. అవేమిటో తెలుసుకుందాం.
మార్కెట్లో కొన్ని నెలలుగా దిద్దుబాటు చోటు చేసుకోవడం చూస్తున్నాం. పెట్టుబడి పెట్టేవారు ఇలాంటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మార్కెట్ పయనం ఎటువైపున్నా.. ఆయా దశల్లో మదుపు చేసి, లాభాలను సంపాదించేందుకు సరైన వ్యూహాల్ని, క్రమశిక్షణతో ఆచరించాలి. అవేమిటో తెలుసుకుందాం.
వ్యక్తులను బట్టి పెట్టుబడి ప్రణాళిక మారుతూ ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తికి సరిపోయే పెట్టుబడి విధానం, శైలి 60 ఏళ్ల వ్యక్తికి సరిపోకపోవచ్చు. మదుపు మొత్తం, పెట్టుబడి కాలం, వేచి ఉండే వ్యవధి, నష్టాన్ని తట్టుకునే సామర్థ్యం, ఎంత లాభాలను ఆశిస్తున్నారు, ఎంచుకునే వ్యూహం ఇలా పలు అంశాలు పెట్టుబడులను ప్రభావితం చేస్తుంటాయి. మార్కెట్ ఒక్కో దశలో కొన్ని వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. ఈ విధానమే సరైనది, ఇదే కచ్చితమైనది అని చెప్పలేం.
సొంతంగా.. సూచీల ఆధారంగా...
మార్కెట్ సూచీని మించి రాబడిని పొందాలనుకునే వారు తరచూ, చురుకుగా షేర్ల క్రయవిక్రయాలు చేస్తుంటారు. ఇలాంటి వ్యూహాన్ని ‘యాక్టివ్ ఇన్వెస్టింగ్’గా చెప్పొచ్చు. మార్కెట్పై పూర్తి అవగాహన, నైపుణ్యం అవసరం. ఈ వ్యూహం ఎవరికి వారు సొంతంగా పాటించవచ్చు. నిపుణుల సహాయంతోనూ కొనసాగించవచ్చు.
షేర్లు లేదా ఇండెక్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్)లాంటివి కొనుగోలు చేసి, వాటిల్లో దీర్ఘకాలం కొనసాగడం ‘పాసివ్ ఇన్వెస్ట్మెంట్’ వ్యూహం. స్వల్పకాలిక హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో మెరుగైన రాబడి పొందడమే దీని లక్ష్యం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంకింగ్ మొదలైన ఇండెక్స్, ఈటీఎఫ్లు, నాణ్యమైన షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఈ కోవలోకే వస్తాయి.
పెట్టుబడి వృద్ధికంటే.. రిస్క్తో సంపద సృష్టి కోసం చూస్తున్నవారు యాక్టివ్ ఇన్వెస్టింగ్ వైపు మొగ్గు చూపించొచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో రాబడిని సాధించాలనుకుంటే.. పాసివ్ ఇన్వెస్ట్మెంట్ పరిశీలించాలి.
విలువ... వృద్ధి...
గత పనితీరు బాగుండి, బలమైన ఆర్థిక పునాదులు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ షేరు ఉండాల్సిన వాస్తవిక ధరకన్నా తక్కువకు లభిస్తుంటుంది. ఇలాంటి షేర్లను ఎంచుకోవడం విలువ ఆధారిత పెట్టుబడి. ఈ కంపెనీలు భవిష్యత్లో మంచి పనితీరు కనబరిస్తే.. లాభాలు సొంతం చేసుకోవచ్చు.
అధిక వృద్ధిని నమోదు చేస్తున్న, భవిష్యత్లో చేయగల కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి, అధిక రాబడిని ఆర్జించడం వృద్ధి ఆధారిత పెట్టుబడి వ్యూహం. ఆయా కంపెనీల వస్తూత్పత్తులు, సేవల్లో కొత్తదనం, నాణ్యత, ప్రయోజనాలు మొదలైన అంశాలు ఇక్కడ కీలకం. సహజంగా మిగిలిన వాటికంటే ఇవి అధిక వృద్ధిని నమోదు చేస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో కాస్త అధిక నష్టభయం ఉంటుంది. లాభాలూ ఎక్కువగానే ఉంటాయి.
విలువ ఆధారిత వ్యూహంలో తక్కువ ధర, తక్కువ నష్టభయం ఉండటంతోపాటు, ఓపికతో ఎక్కువ కాలం కొనసాగడం ముఖ్యం. ఈ షేర్లు ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ తిరిగి పుంజుకున్నప్పుడు మంచి రాబడులను అందిస్తాయి. వృద్ధి ఆధారిత వ్యూహంలో షేర్లు బలమైన ఆదాయాలు, లాభాలు ప్రకటిస్తున్నప్పుడు, తక్కువ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నప్పుడు లాభాలను పంచుతాయి.
పెద్ద షేర్లలో..
సహజంగా ఒక రంగంలో ఆధిపత్యంతో, స్థిరమైన పనితీరును చూపించే వాటిని లార్జ్క్యాప్ షేర్లుగా చెప్పొచ్చు. ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోనూ ఇవి నిలకడగా ఉంటాయి. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలను భవిష్యత్లో వృద్ధికి ఆస్కారం ఉన్న కంపెనీలుగా చెప్పొచ్చు. ఇక్కడ రిస్క్-రివార్డు రెండూ ఎక్కువే. మార్కెట్, ఆర్థిక వ్యవస్థ కోలుకునే దశలో ఇవి మంచి రాబడులను ఇస్తుంటాయి.
భిన్నమైన మార్గంలో..
మార్కెట్లో నలుగురు ఆచరిస్తున్న నిర్ణయాలకు, ఆశ-నిరాశావాదాలకు భిన్నంగా షేర్ల క్రయ విక్రయాలు చేస్తూ రాబడిని పొందడమే ఈ వ్యూహ లక్షణం.
10-12 కంపెనీల్లో..
కేవలం ఒకటో రెండో రంగాలు, లేదా ఒకటి రెండు షేర్లలో పెట్టుబడులు సరికాదు. 4-5 రంగాల్లోని నాణ్యమైన 10-12 కంపెనీలను ఎంచుకోవడం మంచిది. నష్టాన్ని భరించే సామర్థ్యం, అవగాహన తదితర అంశాలను బట్టి, ఏ కంపెనీలను ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. వైవిధ్యం పాటించడం వల్ల నష్టభయం పరిమితం అవుతుంది. అదే సమయంలో అతి వైవిధ్యమూ మంచి ఫలితాలను ఇవ్వదు.
* ఎక్కువ నష్టభయం భరించలేని వారు.. స్థిరమైన ఆదాయం కోరుకునే వారు.. షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, రీట్స్, ఇన్విట్స్లాంటి వాటిల్లో మదుపు చేయాలి. డివిడెండ్లు, వడ్డీ రూపంలో కొంత ఆదాయాన్ని తక్కువ నష్టభయంతో పొందడం ఇక్కడ లక్ష్యం.
నష్టానికి పరిమితి...
పెట్టుబడులకు నష్టభయం అంతర్లీనంగా ఉంటుంది. స్వల్ప, మధ్యకాలిక ట్రేడర్లు ఎంత నష్టాన్ని భరించగలరు అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక షేరు మీ నష్టభయ సామర్థ్యాన్ని మించి తగ్గుతున్నప్పుడు స్టాప్లాస్ వ్యూహాన్ని పాటించాలి. ఉదాహరణకు..
సందర్భం 1: ధర పెరుగుతుందన్న నమ్మకంతో మీరు ఏబీసీ షేరు రూ.100కి కొన్నారు. మార్కెట్ తగ్గితే.. షేరుకు రూ.5 నష్టంతో బయటపడాలి అనుకున్నారు. అందుకు రూ.95 వద్ద స్టాప్లాస్ పెట్టుకున్నారు. పరిస్థితి బాగా లేక ఆ షేరు ధర రూ.90కి చేరిందనుకుందాం. స్టాప్లాస్ వ్యూహం వల్ల మీరు రూ.5 నష్టంతో బయటపడ్డారు.
సందర్భం 2: షేరు రూ.100 నుంచి రూ.110కి వెళ్లింది. మీ స్టాప్ లాస్ రూ.95 నుంచి రూ.105కి చేశారు. షేరు ధర రూ.120కి చేరింది. అప్పుడు స్టాప్ లాస్ రూ.115కు మార్చారు. ఇలా చేయడం వల్ల పెట్టుబడి కొనసాగించుకుంటూ, లాభాలను రక్షించుకోవచ్చు. దీన్ని ట్రెయిలింగ్ స్టాప్ లాస్ అంటారు. షేర్ల రాబడులను కంపెనీల పనితీరుతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వార్తలు, ఆయా రంగాల మంచి చెడులు ప్రభావితం చేస్తుంటాయి. అన్ని వ్యూహాల్లో లాభనష్టాలు, పరిమితులు ఉంటాయి. ఆయా వ్యూహాలను మనకు అనుగుణంగా మార్చుకొని, ఆచరించినప్పుడే పెట్టుబడులు లాభాల తీరాన్ని చేరుతాయి.
- జాగర్లమూడి వేణుగోపాల్, జెన్మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు