Stock Market: స్టాక్ మార్కెట్ సూచీల్లో ‘అమెరికా అప్పుల’ జోష్!
Stock Market: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 492 పాయింట్ల లాభంతో 62,993 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 129 పాయింట్ల లాభంతో 18,628 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 492 పాయింట్ల లాభంతో 62,993 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 129 పాయింట్ల లాభంతో 18,628 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పుంజుకొని 82.53 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, పవర్గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
యూఎస్ ఫ్యూచర్ మార్కెట్లు ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడవుతున్నాయి. అప్పుల పరిమితి పెంపుపై అధ్యక్షుడు బైడెన్, హౌస్ స్పీకర్ మెకార్థి మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ నేడు సమావేశం కానున్న నేపథ్యంలో మదుపర్ల దృష్టి అటువైపు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 1 శాతం పెరిగి 78 డాలర్ల ఎగువకు చేరింది. శుక్రవారం దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,841 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో విదేశీ సంస్థాగత మదుపర్లు సైతం రూ.350 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొన్నారు.
గమనించాల్సిన స్టాక్స్..
మహీంద్రా అండ్ మహీంద్రా: వ్యాపార విభాగాలన్నీ రాణించడంతో గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు లాభాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నమోదుచేసింది. 2021-22లో ఏకీకృత నికర లాభం రూ.6,577 కోట్లు కాగా.. 2022-23లో 56% అధికంగా రూ.10,282 కోట్లకు చేరింది. సంస్థ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం. ఆదాయం రూ.90,171 కోట్ల నుంచి 34% పెరిగి రూ.1,21,269 కోట్లకు చేరింది.
సన్ఫార్మా: మార్చి త్రైమాసికంలో సన్ఫార్మా ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.1,984 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో కంపెనీ రూ.2,277 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.9,447 కోట్ల నుంచి రూ.10,931 కోట్లకు చేరుకుంది.
సెయిల్: ప్రభుత్వరంగ ఉక్కు దిగ్గజం సెయిల్, మార్చి త్రైమాసికంలో రూ.1159.21 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2478.82 కోట్ల కంటే ఇది 50% కంటే తక్కువ. మొత్తం ఆదాయం రూ.31,175.25 కోట్ల నుంచి రూ.29,416.39 కోట్లకు తగ్గింది.
ఎన్సీసీ: నిర్మాణ రంగ సంస్థ ఎన్సీసీ, మార్చి త్రైమాసికంలో రూ.4981.36 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.190.86 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.3491.76 కోట్ల ఆదాయంపై, రూ.242.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.15,701 కోట్లు, నికర లాభం రూ.609.20 కోట్లుగా ఉంది. రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.2.20 (110%) డివిడెండు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్: మార్చి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.2,355.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,070.46 కోట్లతో పోలిస్తే ఇది 42.12% తక్కువ. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.28,811.39 కోట్ల నుంచి రూ.33,462.14 కోట్లకు వృద్ధి చెందింది.
ONGC: జనవరి- మార్చి త్రైమాసికానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) రూ.247.70 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.8,859.54 కోట్లుగా నమోదైంది. పన్ను బకాయిల కేసులకు సంబంధించి రూ.12,100 కోట్ల వరకు కేటాయింపులు చేయాల్సి రావడమే సంస్థ నష్టాలను ప్రకటించేందుకు కారణమైంది.
అరబిందో ఫార్మా: కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.6,473 కోట్ల ఆదాయాన్ని, రూ.506 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
జీఎంఆర్ ఇన్ఫ్రా: విమానాశ్రయాలు, మౌలిక వసతుల నిర్వహణ సంస్థ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(జీఎంఆర్ ఇన్ఫ్రా) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,894.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర నష్టం రూ.636.74 కోట్లుగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి