Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 18,250 పైకి నిఫ్టీ
Stock Market: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 141 పాయింట్ల లాభంతో 61,871 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 52 పాయింట్లు లాభపడి 18,256 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ, కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే పుంజుకుంటున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 141 పాయింట్ల లాభంతో 61,871 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 52 పాయింట్లు లాభపడి 18,256 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.79 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, టైటన్, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. డెట్ సీలింగ్ పరిమితి పెంపుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగడం అక్కడి మదుపర్లను కలవరపెడుతోంది. ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. నెలవారీ ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల గడువు ఈ వారమే ముగియనుంది. రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియనూ మార్కెట్లు సునిశితంగా పరిశీలించొచ్చు. నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా రుణ పరిమితి ఒప్పందంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపై ఆధారపడి, సమీప కాలంలో మార్కెట్లు కదలాడొచ్చని నిపుణులు అంటున్నారు. విదేశీ మదుపర్లు శుక్రవారం రూ.113.46 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.1,071 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
గమనించాల్సిన స్టాక్స్..
దివీస్ లేబొరేటరీస్: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.1,974 కోట్ల ఆదాయాన్ని, రూ.319 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.2,546 కోట్లు, నికరలాభం రూ.883 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోలిస్తే ఈసారి ఆదాయం, లాభం బాగా తక్కువగా నమోదయ్యాయి.
జేఎస్డబ్ల్యూ స్టీల్: జనవరి- మార్చి త్రైమాసికంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 11.90 శాతం పెరిగి రూ.3,741 కోట్లకు చేరింది. అధిక ఆదాయం ఇందుకు కలిసొచ్చింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.3,343 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.47,128 కోట్ల నుంచి రూ.47,427 కోట్లకు పెరిగింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: మార్చి త్రైమాసికంలో రూ.1,159 కోట్ల నికరలాభాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక స్టాండలోన్ నికరలాభం రూ.202 కోట్లతో పోలిస్తే, ఈ మొత్తం 5 రెట్ల కంటే అధికం. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పెరగడం ఇందుకు కారణం. ఇదే సమయంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.21,095 కోట్ల నుంచి రూ.27,269 కోట్లకు పెరిగింది.
బంధన్ బ్యాంక్: మార్చి త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 58 శాతం క్షీణించి రూ.808 కోట్లకు పరిమితమైంది. అధిక కేటాయింపులు ఇందుకు కారణమయ్యాయి. 2021-22 ఇదే మూడు నెలల్లో బ్యాంకు లాభం రూ.1,902 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.4,844 కోట్ల నుంచి రూ.4,897.38 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు