Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 46 పాయింట్ల లాభంతో 61,478 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 46 పాయింట్ల లాభంతో 61,478 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, మారుతీ, టాటా స్టీల్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. డెట్ సీలింగ్ పరిమితి పెంపుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉందన్న అంచనాలు అక్కడి మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. మరోవైపు నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ సూచీలు 33 ఏళ్ల గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలో వేగం, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భారత్కు ‘బీబీబీ-’ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ వెల్లడించింది. ఈ రోజు జేఎస్డబ్ల్యూ స్టీల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పవర్ గ్రిడ్, గ్లెన్మార్క్, జొమాటో వంటి కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.970.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ మదుపర్లు రూ.849.96 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
గమనించాల్సిన స్టాక్స్..
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రికార్డు లాభాలను ప్రకటించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో రూ.16,694.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.9,113.53 కోట్లతో పోలిస్తే, ఈ మొత్తం 83% అధికం. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 90% పెరిగి రూ.18,094 కోట్లకు చేరింది.
ITC: మార్చి త్రైమాసికంలో ఐటీసీ లిమిటెడ్ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,225.02 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.4,259.68 కోట్లతో పోలిస్తే ఇది 22.66% అధికం. అన్ని విభాగాల్లో బలమైన వృద్ధి నమోదుకావడం కలిసొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.17,754.02 కోట్ల నుంచి 7% వృద్ధితో రూ.18,799.18 కోట్లకు చేరింది.
కిమ్స్ హాస్పిటల్స్ (KIMS): ‘కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. ఏకీకృత ఖాతాల ప్రకారం త్రైమాసిక ఆదాయం 54.7%, నికరలాభం 18.4% పెరిగాయి. మార్చి త్రైమాసికంలో రూ.575.92 కోట్ల ఆదాయం పై రూ.98.6 కోట్ల నికరలాభాన్ని కిమ్స్ ఆర్జించింది.
నజారా టెక్: ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన నోడ్విన్ గేమింగ్ 28 మిలియన్ డాలర్లు సమీకరించనుంది. ఈ మేరకు ప్రస్తుత ఇన్వెస్టర్లు నజారా, క్రాఫ్టన్, జెట్సింథెసిస్ సహా కొత్త ఇన్వెస్టర్లతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.
సౌత్ ఇండియన్ బ్యాంక్: ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లను వివిధ కాలపరిమితులకు సౌత్ ఇండియన్ బ్యాంక్ పెంచింది.
రతన్ఇండియా ఎంటర్ప్రైజెస్: విను బల్వంత్ సైనీని రతన్ ఇండియా సీఎఫ్ఓగా నియమించింది. ఆయన నియామకం మే 20 నుంచి అమల్లోకి రానుంది.
వీటితో పాటు గురువారం మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, టాటా ఎల్క్సీ, యునైటెడ్ స్పిరిట్స్, కంటైనర్ కార్పొరేషన్, బాటా ఇండియా, గ్లాండ్ ఫార్మా, పీటీసీ ఇండియా, యూనివర్సల్ కేబుల్స్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..