Stock Market: ఊగిసలాటలో మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 17,125
Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 71 పాయింట్ల నష్టంతో 58,166 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్లు నష్టపోయి 17,125 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే సూచీలు ఇలా ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 71 పాయింట్ల నష్టంతో 58,166 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్లు నష్టపోయి 17,125 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.34 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, టైటన్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా- పసిఫిక్ మార్కెట్లపై సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) సంక్షోభ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయంగా చూస్తే ఆహార పదార్థాలు, ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో గత నెలలో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. భారత్లో రిటైల్ డిపాజిట్లు అధికంగా ఉన్నందున ఎస్వీబీ ప్రభావం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్దగా ఉండకపోవచ్చుననే విశ్లేషణలు మదుపర్లకు కొంత ఊరట కలిగించే విషయం. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు అధ్యక్షుడు బైడెన్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వమూ రంగంలోకి దిగింది. ఇది కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచే అంశం. మరోవైపు వరుసగా మూడోరోజూ విదేశీ మదుపర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. సోమవారం రూ.1,546 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు.
గమనించాల్సిన స్టాక్స్..
సన్ టీవీ నెట్వర్క్: మార్చి 2023తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై సన్ టీవీ రూ.2.5 డివిడెండ్ను ప్రకటించింది.
గెయిల్ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గెయిల్ ఒక్కో షేరుపై రూ.4 డివిడెండ్ను ప్రకటించింది. దీనికి 2023 మార్చి 21ని రికార్డు తేదీగా నిర్ణయించింది.
లుపిన్: అమెరికాకు చెందిన ఎఫ్డీఏ.. పుణెలోని లుపిన్ బయోరీసెర్చ్ సెంటర్లో తనిఖీలను పూర్తి చేసింది. ఎలాంటి పరిశీలనలు లేకుండానే ఈ ప్రక్రియ పూర్తి కావడం గమనార్హం.
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్: షేర్ల రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు పీఎన్బీ హౌసింగ్కు సెబీ అనుమతినిచ్చింది.
సూర్య రోష్నీ: సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కు కావాల్సిన 3ఎల్పీఈ పూత స్టీల్ పైప్ల సరఫరాకు హిందూస్థాన్ పెట్రోలియం నుంచి రూ.96.39 కోట్ల ఆర్డర్ లభించినట్లు సూర్య రోష్నీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె