Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర తగ్గింది. యూరో విలువ రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయింది. దేశీయంగా చూస్తే పీఎల్ఐ పథకాలు ఏటా జీడీపీలో 4 శాతం వాటా కలిగి ఉండే అవకాశం ఉందని ఓ ప్రముఖ నివేదిక అంచనా వేసింది. సేవా రంగ కార్యకలాపాలు 11 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోవైపు నిరుద్యోగిత రేటు జూన్లో 78 శాతానికి పెరగడం సూచీలను కలవరపెట్టే అంశం.
ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 53,486 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 15,898 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.25 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఎస్బీఐ, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్ఎం లాభాల్లో పయనిస్తున్నాయి.
నేడు గమనించాల్సిన స్టాక్స్...
టాటా మోటార్స్: ముంబయి రవాణా ఏజెన్సీ - బెస్ట్కు 2100 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా విషయంలో ఓలెక్ట్రా గ్రీన్టెక్ అనుబంధ సంస్థ ఎవీ ట్రాన్స్తో తలెత్తిన వివాదంలో టాటా మోటార్స్ కేసు గెలిచింది.
స్పైస్జెట్: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సంస్థకు విమానాల సాంకేతిక సమస్యల రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంగళవారం మరో రెండు విమానాల్లో సమస్యలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
బజాజ్ హిందూస్థాన్ షుగర్: రుణాలిచ్చిన బ్యాంకులు ఈ కంపెనీ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి.
టాటా స్టీల్: ఉక్కు ఎగుమతులపై సుంకం వల్ల మే నెలలో కంపెనీ డెలివరీలు రెండు శాతం పడిపోయాయి.
బ్రిటానియా ఇండస్ట్రీస్: రూ.5000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం లభించలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chile sinkhole: ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్హోల్..!
-
India News
8th Pay Commission: 8వ వేతన కమిషన్పై.. కేంద్రం క్లారిటీ..!
-
Movies News
Thank You: నాగ చైతన్య ‘థ్యాంక్యూ’.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
-
Politics News
Bihar: భాజపాతో నీతీశ్ బ్రేకప్ వార్తలు: బిహార్లో నేతలు బిజీబిజీ..!
-
Movies News
Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
-
World News
Rishi Sunak: రిషి సునాక్ గెలవాలని.. ప్రవాస భారతీయుల హోమాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే