Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: ఉదయం 9:17 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 206 పాయింట్ల లాభంతో 62,635 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 65 పాయింట్ల లాభంతో 18,553 దగ్గర కొనసాగుతోంది.

Published : 02 Jun 2023 09:28 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 206 పాయింట్ల లాభంతో 62,635 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 65 పాయింట్ల లాభంతో 18,553 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.31 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం లభించడంలో అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ సైతం లాభాల్లో ఉన్నాయి. ఇదే కారణంతో ఆసియా-పసిఫిక్‌ సూచీలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఐరోపా సూచీలు సైతం సానుకూలంగా ట్రేడింగ్‌ ముగించాయి. మేలో బలమైన జీఎస్టీ వసూళ్లు మన మార్కెట్లకు సానుకూల అంశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని