Stock Market Opening bell: స్తబ్ధుగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని స్తబ్ధుగా ప్రారంభించాయి...
ముంబయి: గత మూడు వారాల్లో గణనీయంగా కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని స్తబ్ధుగా ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు తర్వాత కాస్త కోలుకొని ఫ్లాట్గా చలిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ఉదయం సెషన్లో ప్రభావం చూపుతున్నాయి. అయితే, దేశీయంగా సానుకూల పరిణామాలు ఉన్న నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు లాభాల మద్దతు దొరికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల సెంటిమెంటును పెంచే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
ఉదయం 9:26 గంటల సమయానికి సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 58,431 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 17,407 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.46 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, మారుతీ, రిలయన్స్, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటన్, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్బీఐ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్ గ్రిడ్, డెలివరీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, వేదాంత్ ఫ్యాషన్స్, టొరెంట్ పవర్, వల్పూల్ ఇండియా, నాల్కో, సిటీ యూనియన్ బ్యాంక్, అవంతీ ఫీడ్స్, బోరోసిల్, కల్యాణి స్టీల్స్
నేడు గమనించాల్సిన స్టాక్స్...
ఎస్బీఐ: జూన్ త్రైమాసికంలోఎస్బీఐ నికర లాభం 6.7 శాతం మేర తగ్గడంతో రూ.6,068 కోట్లకు పరిమితమైంది. కిందటేడాది ఇదే కాలంలో లాభం రూ.6,504 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ.77,347.17 కోట్ల నుంచి రూ.74,998.57 కోట్లకు తగ్గింది.
టైటన్: ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో టైటన్ రూ.790 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.18 కోట్లతో పోలిస్తే ఇది పలు రెట్లు అధికం. పండగల సీజన్ రాకతో గిరాకీ పెరగడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,519 కోట్ల నుంచి రూ.9,487 కోట్లకు చేరింది.
ఎన్ఎండీసీ: ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ, ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.4,913 కోట్ల ఆదాయాన్ని, రూ.1,467 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.6,656 కోట్లు, నికరలాభం రూ.3,191 కోట్లు ఉన్నాయి.
వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం): ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం మిశ్రమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 88.5 శాతం పెరిగి రూ. 1,679.6 కోట్లకు చేరుకున్నా నికర నష్టం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ.380.2 కోట్ల నష్టంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో నికర నష్టం రూ.644.4 కోట్లకు పెరిగిందని పేటీఎం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన