Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి చేరిన నేపథ్యంలో మార్కెట్లు ఉత్సాహంగా చలిస్తున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా తోడయ్యాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. దేశీయంగా నవంబరు నెలలో ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 121 పాయింట్ల లాభంతో 62,252 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 31 పాయింట్లు లాభపడి 18,528 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.66 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్గ్రిడ్, హెచ్యూఎల్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మైక్రోసాఫ్ట్, ఫైజర్ షేర్లలో కొనుగోళ్ల వెల్లువ అక్కడి సూచీలకు కలిసొచ్చింది. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ.138.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. నేడు ల్యాండ్మార్క్ కార్స్ ఐపీఓ (Landmark Cars IPO) ప్రారంభం కానుంది. డిసెంబరు 15న ముగియనుంది.
గమనించాల్సిన స్టాక్స్..
దాల్మియా భారత్: జైప్రకాశ్ అసోసియేట్స్కు చెందిన 9.4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్ ప్లాంట్లను దాల్మియా భారత్ కొనుగోలు చేయనుంది.
ఐసీఐసీఐ బ్యాంక్: వ్యాపార విస్తరణ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించింది.
వన్ 97కమ్యూనికేషన్స్ (పేటీఎం): తమ రుణాల మంజూరు మొత్తం రూ.39,000 కోట్ల ‘యాన్యువలైజ్డ్ రన్ రేట్’కు చేరిందని పేటీఎం సోమవారం వెల్లడించింది.
స్టీల్ స్టాక్స్: ప్రభుత్వ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల పథకం (PLI)’ కింద పలు స్టీల్ కంపెనీలు ఎంపిక అయ్యాయి.
రూట్ మొబైల్: మెషీన్ లెర్నింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఏ2పీ ఫైర్వాల్ సొల్యూషన్స్ను ఉగాండా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్కు అందించేందుకు రూట్ మొబైల్ అనుబంధ సంస్థ 365స్క్వేర్డ్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది.
కేఈసీ ఇంటర్నేషనల్: రూ.1,349 కోట్లు విలువ చేసే కొత్త ఆర్డర్లు కేఈసీ ఇంటర్నేషనల్ దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!