Stock Market: భారీగా పతనమైన మార్కెట్లు.. 2రోజుల్లో ₹10 లక్షల కోట్లు ఆవిరి
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం అమ్మకాల వెల్లువతో కొట్టుమిట్టాడాయి. అదానీ షేర్ల పతనం సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది.
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు మదుపర్లను శుక్రవారం భారీ నష్టాల్లో ముంచాయి. కీలక సూచీలు రెండు శాతానికి పైగా కుంగి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. క్రితం సెషన్లోనూ సూచీలు భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. రెండు రోజుల వరుస నష్టాలతో మదుపర్లు దాదాపు రూ.10.65 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కూడా జరగనుంది. ఈ కీలక పరిణామాలకు మరికొన్ని ప్రతికూల అంశాలూ జతకావడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు మాత్రం అమ్మకాల వెల్లువతో కొట్టుమిట్టాడాయి.
అదానీ గ్రూప్ షేర్ల పతనం కూడా ఈరోజు మార్కెట్ సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అదానీ టోటల్ గ్యాస్ షేర్ 20 శాతం వరకు నష్టపోయింది. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ 18 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 16 శాతం వరకు నష్టపోయాయి. దీనికి బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, విదేశీ మదుపర్ల విక్రయాలు కూడా జతయ్యాయి. బడ్జెట్పై అంచనాలు, బాండ్ల రాబడుల్లో పెరుగుదల, చమురు ధరల్లో ఊగిసలాట కూడా సూచీల పతనంలో తమ వంతు పాత్ర పోషించాయి.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 60,166.90 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఓ దశలో 1,100 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ 58,974.70 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 874.16 పాయింట్ల భారీ నష్టంతో 59,330.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,877.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,493.55 దగ్గర దిగువ స్థాయికి చేరుకుంది. చివరకు 287.60 పాయింట్ల నష్టంతో 17,604.35 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49 వద్ద నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో 22 షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్, ఐటీసీ, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, సన్ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర అంశాలు..
☞ భారీ అమ్మకాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈరోజు ఓ దశలో 3 శాతానికి పైగా నష్టపోయింది. రూ. 2,312 వద్ద పది నెలల కనిష్ఠానికి చేరింది. చివరకు 1.83 శాతం నష్టపోయి రూ. 2,339 వద్ద స్థిరపడింది.
☞ బలహీన మార్కెట్లోనూ ఐటీసీ షేర్లు రాణించాయి. కంపెనీ షేరు ఇంట్రాడేలో 3 శాతానికి పైగా పెరిగి రూ. 348.80 వద్ద మూడు నెలల గరిష్ఠానికి చేరింది. చివరకు 1.84 శాతం లాభంతో రూ. 345.50 వద్ద ముగిసింది.
☞ అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో టాటా మోటార్స్ గత రెండేళ్లలో తొలిసారి నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో సంస్థ షేర్లు ఈరోజు రాణించాయి. చివరకు 6.25 శాతం లాభంతో రూ. 445.25 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.