Stock Market: రెండోరోజూ లాభాలే.. నిఫ్టీ @17,100
Stock Market: సెన్సెక్స్ (Sensex) 355.06 పాయింట్ల లాభంతో 57,989.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 114.45 పాయింట్లు లాభపడి 17,100.05 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకొని భారీ లాభాలతో ఈ వారానికి స్వస్తి పలికాయి. ఐటీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ జంట షేర్ల వంటి దిగ్గజ స్టాక్స్ భారీగా నష్టపోవడం మధ్యాహ్నం సూచీలను కిందకు లాగింది. తర్వాత ఐటీ స్టాక్స్లో వచ్చిన కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు అండగా నిలిచింది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అమెరికాలో బడా బ్యాంకులు చేస్తున్న యోచనలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మరోవైపు గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కీలక కౌంటర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కలిసొచ్చింది.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 58,038.17 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,178.94- 57,503.90 మధ్య కదలాడింది. చివరకు 355.06 పాయింట్ల లాభంతో 57,989.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,111.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,145.80- 16,958.15 మధ్య ట్రేడైంది. చివరకు 114.45 పాయింట్లు లాభపడి 17,100.05 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 82.56 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, మారుతీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, పవర్గ్రిడ్, హెచ్యూఎల్, టీసీఎస్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ నిన్న భారీగా పుంజుకున్న స్విట్జర్లాండ్కు చెందిన క్రెడిట్ సూయిజ్ షేరు ఈ రోజు తిరిగి నష్టాల్లోకి జారుకుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:57 గంటల సమయంలో స్విస్ ఎక్స్ఛేంజ్ ఎస్ఐఎక్స్లో ఈ షేరు 3.51 శాతం విలువ కోల్పోయింది.
☛ ఈస్ట్కోస్ట్ రైల్వే నుంచి జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ రూ.587.59 కోట్లు విలువ చేసే ప్రాజెక్టును సొంతం చేసుకుంది. అయినప్పటికీ.. కంపెనీ షేరు ఈ రోజు 0.25 శాతం నష్టపోయి రూ.1,027 వద్ద ముగిసింది.
☛ మౌలిక వసతుల అభివృద్ధి, ఈథేన్ సోర్సింగ్కు సంబంధించి గెయిల్ ఇండియా.. షెల్ ఎనర్జీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొంది. గెయిల్ షేరు నేడు 0.50 శాతం లాభపడి రూ.110.10 వద్ద స్థిరపడింది.
☛ టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ రాజీనామా నేపథ్యంలో కంపెనీ షేరు ఈ రోజు తీవ్ర ఒడుదొడుకులను చవిచూసింది. చివరకు 0.31 శాతం నష్టపోయి రూ.3,175 దగ్గర నిలిచింది.
☛ మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా దశలవారీగా నిధులను సమీకరించాలని హెచ్డీఎఫ్సీ భావిస్తోంది. ఈ మేరకు మార్చి 27న బోర్డు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు ఎన్ఎస్ఈలో 1.29 శాతం పెరిగి రూ.2564 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత