Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 17800 దిగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమయ్యాయి.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 455 పాయింట్ల నష్టంతో 59,749 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 125 పాయింట్లు నష్టపోయి 17,766 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.51 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఐటీసీ, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మిశ్రమ కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడయ్యాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం వెలిగిపోతోందని, వచ్చే ఏడాది 6.7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్ వెల్లడించారు. బుధవారం విదేశీ మదుపర్లు రూ. 2,393.94 కోట్లు విలువ చేసే షేర్లు విక్రయించారు.
ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, వేదాంత, ఆర్తీ డ్రగ్స్, ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏఎంసీ, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, స్టెరిలైట్ టెక్నాలజీస్
గమనించాల్సిన స్టాక్స్..
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్: డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.6,770 కోట్ల ఆదాయంపై రూ.1,247 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈపీఎస్ రూ.74.95గా నమోదైంది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.5,319 కోట్లు, నికరలాభం రూ.706 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 27%, నికరలాభం 77% పెరిగాయి.
అమరరాజా బ్యాటరీస్: డిసెంబరు త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్ రూ.2,637 కోట్ల ఆదాయాన్ని, రూ.302 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.2,365 కోట్లు, నికరలాభం రూ.197 కోట్లు ఉన్నాయి. వాహన, టెలికాం విభాగాల్లో అధిక అమ్మకాల వల్లే ఆదాయాలు, లాభాలు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.
సిప్లా: ఔషధ దిగ్గజం సిప్లా డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.808 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.757 కోట్లతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,479 కోట్ల నుంచి రూ.5,810 కోట్లకు వృద్ధి చెందింది.
ఇండియన్ బ్యాంక్: డిసెంబరు త్రైమాసికంలో రూ.1396 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.690 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు. వడ్డీ ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గడమే ఇందుకు కారణం. మొత్తం ఆదాయం రూ.11,482 కోట్ల నుంచి రూ.13,551 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఆటో: అక్టోబరు- డిసెంబరులో ఏకీకృత పద్ధతిన రూ.1,473 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,430 కోట్లతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగింది. దేశీయంగా అమ్మకాల వృద్ధి ఇందుకు దోహదం చేసింది.
టాటా మోటార్స్: ఈ కంపెనీ రెండేళ్లలోనే తొలిసారిగా నికరలాభాన్ని డిసెంబరు త్రైమాసికంలో నమోదు చేసింది. సంస్థ రూ.3,043 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,451 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.72,229 కోట్ల నుంచి రూ.88,489 కోట్లకు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..