Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 18,650 దిగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 91.85 పాయింట్లు నష్టపోయి 18,634.55 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. దీంతో నాలుగు రోజుల వరస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం అప్రమత్తంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాల ప్రకటన తర్వాత పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు లాభాల్లోకి ఎగబాకాయి. కానీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం కఠిన విధాన వైఖరిని అవలంబిస్తామని ఆర్బీఐ ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులు ఎదుర్కొంటోందని.. అది భారత్పై కూడా ప్రభావం చూపుతుందనడం కూడా మదుపర్లను కలవరపెట్టింది. దీంతో గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం సెన్సెక్స్ (Sensex) 63,140.17 దగ్గర స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,321.40- 62,789.73 మధ్య కదలాడింది. చివరకు 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,725.35 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,777.90- 18,615.60 మధ్య ట్రేడైంది. చివరకు 91.85 పాయింట్లు నష్టపోయి 18,634.55 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పతనమై 82.57 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సన్ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ ఎఫ్టీఏఐ ఏవియేషన్ 20 ఇంజిన్లను ఇవ్వడానికి తమతో ఒప్పందం కుదుర్చుకుందని స్పైస్జెట్ ప్రకటించింది. వచ్చే 2- 3 నెలల్లో మరికొన్ని విమానాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 4.37 శాతం పుంజుకొని రూ.27.93 దగ్గర ముగిసింది.
☛ పేటీఎం షేరు ఇంట్రాడేలో 8 శాతానికి పైగా పెరిగి 9 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 6.29 శాతం పుంజుకొని రూ.772.50 దగ్గర స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం