Stock Market: 17,000 దిగువకు నిఫ్టీ.. సూచీలను వెంటాడిన ‘బ్యాంకింగ్’ భయాలు!
Stock Market: సెన్సెక్స్ (Sensex) 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 111.65 పాయింట్లు నష్టపోయి 16,988.40 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఓ దశలో భారీ అమ్మకాల సెగతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు మార్కెట్లను వెంటాడాయి. దిగ్గజ షేర్ల పతనం సూచీలను మరింత కిందకు తీసుకెళ్లింది. మరోవైపు ఈ వారం జరగనున్న ఫెడ్ సమావేశం కూడా మదుపర్లను అప్రమత్తం చేసింది.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 57,773.55 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,084.91 దగ్గర ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,066.60 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 16,828.35 దగ్గర ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 111.65 పాయింట్లు నష్టపోయి 16,988.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు కుంగి 82.62 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో హెచ్యూఎల్, ఐటీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్ నష్టాలకు కారణాలు..
బ్యాంకింగ్ రంగ సంక్షోభం: ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్ సహా క్రెడిట్ సూయిజ్ వంటి బ్యాంకుల ఆర్థిక ఇబ్బందులు మార్కెట్లను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా సంస్థలను కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇన్వెస్టర్లలో మాత్రం భయాలు తొలగడం లేదు. ఈ ప్రభావం మరికొన్ని బ్యాంకులకూ విస్తరించే ప్రమాదం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
యూఎస్ ఫెడ్ సమావేశం: ఈ వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు భేటీ కానుంది. వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకింగ్ రంగ సంక్షోభం నేపథ్యంలో ఫెడ్ తాత్కాలికంగా రేట్ల పెంపును నిలిపివేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడే లక్ష్యమని ప్రకటించిన ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఈ అనిశ్చితి మార్కెట్లను కలవరానికి గురిచేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ల పతనం: పై కారణాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. క్రెడిట్ సూయిజ్ కొనుగోలు పరిణామం ఆసియా- పసిఫిక్ సూచీలు నెగెటివ్గా తీసుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సైతం ప్రస్తుతం ప్రతికూలంగానే ఉన్నాయి. ఐరోపా మార్కెట్లూ అదే బాటలో ఉన్నాయి.
అదానీ గ్రూప్ షేర్ల పతనం: హిండెన్బర్గ్ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో మధ్యలో కొన్నిరోజులు రాణించినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతో తిరిగి నష్టాల బాట పట్టాయి. ఈరోజు అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ లోయర్ సర్క్యూట్ని తాకాయి. ఒక్క అదానీ గ్రీన్ ఎనర్జీ మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ అగ్రిటెక్ సంస్థ మిత్రాను పూర్తిగా చేజిక్కించుకునేందుకు అందులోని ఓమ్నివోర్ వాటాను మహీంద్రా అండ్ మహీంద్రా కొనుగోలు చేసింది. ఎంఅండ్ఎం షేరు విలువ ఈరోజు 0.21 శాతం కోల్పోయి రూ.1,169 వద్ద స్థిరపడింది.
☛ స్విస్ సూచీ ఎస్ఐఎక్స్లో క్రెడిట్ సూయిజ్ షేరు ఇంట్రాడేలో 63 శాతం పతనమైంది. మరోవైపు దీన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించిన యూబీఎస్ షేరు విలువ సైతం 13 శాతం కుగింది.
☛ అహ్లూవాలియా కాంట్రాక్ట్స్కు రూ.723 కోట్లు విలువ చేసే ఆర్డర్ లభించింది. షేరు ధర ఈరోజు 1.35 శాతం పెరిగి రూ.479 వద్ద ముగిసింది.
☛ ఈరోజు ట్రేడింగ్లో రిలయన్స్, విప్రో, జుబిలంట్ ఫుడ్ వర్క్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఎంఫసిస్, లారస్ ల్యాబ్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఇమామి, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ షేర్లు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)