Stock Market: ఆఖరి రోజు మార్కెట్ల జోరు.. సెన్సెక్స్కు 1,000 పాయింట్ల లాభం
Stock Market: సెన్సెక్స్ (Sensex) చివరకు 1031.43 పాయింట్ల లాభంతో 58,991.52 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) చివరకు 279.05 పాయింట్లు లాభపడి 17,359.75 దగ్గర ముగిసింది.
ముంబయి: ఆర్థిక సంవత్సరం చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు మద్దతునిచ్చాయి. దీనికి దేశీయంగా దిగ్గజ కంపెనీల షేర్ల ర్యాలీ జతకావడంతో సూచీలు రాణించాయి.
లాభాలకు కారణాలు..
అంతర్జాతీయ సూచీలు: బ్యాంకింగ్ రంగ సంక్షోభం వల్ల నెలకొన్న ఆందోళనలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయా దేశాలు బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంటు బలపడుతోంది. గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం అదే బాటలో పయనించాయి.
విదేశీ మదుపర్ల కొనుగోళ్లు: గతకొన్ని రోజుల ట్రెండ్కు భిన్నంగా విదేశీ మదుపర్లు గురువారం భారీ ఎత్తున భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈరోజు కూడా అది కొనసాగింది. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో ఉన్నారు.
రిలయన్స్ ర్యాలీ: ఆర్థిక సేవల వ్యాపారాన్ని రిలయన్స్ వేరు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు మే 2న రుణదాతలు, షేర్హోల్డర్లతో సమావేశం నిర్వహించనుంది. వేరు చేసిన తర్వాత రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్లను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) పేరిట లిస్ట్ చేయనుంది. రిలయన్స్లో ఉన్న ఒక్కో షేరుకు మదుపర్లు ఒక్కో జేఎఫ్ఎస్ షేరును పొందనున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు ఏకంగా 4 శాతానికి పైగా లాభపడింది. దీనికి బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, వంటి దిగ్గజ షేర్ల ర్యాలీ కూడా జతైంది.
దిద్దుబాటులో లాభాల వేట: గతకొన్ని నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ దిద్దుబాటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో కీలక కంపెనీల షేరు విలువలు ఆకర్షణీయ స్థాయికి పడిపోయాయి. దీంతో అధిక లాభాల కోసం కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 58,273.86 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,068.47 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1031.43 పాయింట్ల లాభంతో 58,991.52 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,210.35 దగ్గర ప్రారంభమై 17,381.60 దగ్గర ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది. చివరకు 279.05 పాయింట్లు లాభపడి 17,359.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 82.17 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో రిలయన్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. సన్ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టైటన్ షేర్లు నష్టపోయాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ గత ఏడాది వ్యవధిలో ఎంఫసిస్ షేరు దాదాపు సగానికి పడిపోయింది. దీంతో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈరోజు కంపెనీ షేరు ఏకంగా 4.43 శాతం లాభపడి రూ.1,794.25 వద్ద స్థిరపడింది.
☛ రక్షణ శాఖ నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు లభిస్తున్న నేపథ్యంలో డిఫెన్స్ కంపెనీ షేర్లు ఈరోజు కళకళలాడాయి.
☛ భారత్కు చెందిన క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కొనుగోలు చేసేందుకు నెస్లే ఎస్ఏ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నెస్లే ఇండియా షేరు ఈరోజు 3.29 శాతం పెరిగి రూ.19,680 దిగ్గర ముగిసింది.
☛ హీరో మోటోకార్ప్ షేరు ఈరోజు 1.70 శాతం లాభపడి రూ.2,343 వద్ద ముగిసింది. సీఎఫ్ఓ నిరంజన్ గుప్తాకు కంపెనీ సీఈఓగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో షేరు సానుకూలంగా స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు