Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు.. 18,600 చేరువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 344.69 పాయింట్ల లాభంతో 62,846.38 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 99.30 పాయింట్లు లాభపడి 18,598.65 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపుపై పురోగతి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇదే మన మార్కెట్లలోనూ సానుకూలతలు నింపింది. హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎంఅండ్ఎం వంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 63,000 మార్క్ను తాకడం విశేషం.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 62,801.54 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,026.00- 62,801.54 మధ్య కదలాడింది. చివరకు 344.69 పాయింట్ల లాభంతో 62,846.38 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,619.15 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,641.20- 18,581.25 మధ్య ట్రేడైంది. చివరకు 99.30 పాయింట్లు లాభపడి 18,598.65 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు పతనమై 82.64 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఎంఅండ్ఎం, టైటన్, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్, మారుతీ, విప్రో, టీసీఎస్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ ఎస్ఎంఎల్ ఇసుజు ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 70 శాతం పెరిగింది. నికర లాభం రూ.26.79 కోట్లుగా నమోదైంది. కంపెనీ షేరు ఈరోజు రూ.1,124 దగ్గర ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 4.80 శాతం లాభపడి రూ.1,069 దగ్గర స్థిరపడింది.
☛ జనవరి- మార్చి త్రైమాసికంలో ఎన్ఐఐటీ ఆదాయం 35.56 శాతం తగ్గి రూ.60.05 కోట్లకు చేరింది. అదే సమయలో నికర నష్టాలు 9.37 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 13 వారాల కనిష్ఠానికి చేరింది. చివరకు 1.40 శాతం నష్టపోయి రూ.399 దగ్గర నిలిచింది.
☛ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో తిరిగి ర్యాలీ వస్తోంది. దీంతో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్లు కలిగిన దేశంగా మళ్లీ నిలిచింది. జనవరిలో భారత్ ఈ స్థానాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.
☛ ఫేమ్-2 రాయితీ పథకం నుంచి గ్రీవ్స్ కాటన్ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 10.22 శాతానికి పైగా నష్టపోయి రూ.133.15 దగ్గర స్థిరపడింది.
☛ ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 2 శాతానికి పైగా పెరిగి రూ.1,294.65 దగ్గర మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1లక్ష కోట్లను తాకింది. చివరకు కంపెనీ షేరు 1.21 శాతం లాభపడి రూ.1,283.35 దగ్గర ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!