Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 18,400 దిగువకు నిఫ్టీ
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో చలిస్తున్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 488 పాయింట్ల నష్టంతో 61,693 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 143 పాయింట్లు నష్టపోయి 18,353 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.61 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, విప్రో అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు గతవారానికి నష్టాలతో ముగింపు పలికాయి. ప్రస్తుతం యూఎస్ ఫ్యూచర్స్ ప్రతికూలంగా చలిస్తున్నాయి. ఆసియా- పసిఫిక్ మార్కెట్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీ రేట్లను 50 లేదా 75 బేసిస్ పాయింట్ల మేర ఫెడ్ పెంచొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. మన కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఫెడ్ నిర్ణయాలు వెలువడతాయి. అప్పటివరకు మార్కెట్లు స్తబ్ధుగా చలించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 15న ఐరోపా, బ్రిటన్ కేంద్ర బ్యాంకులూ సమావేశం కానున్నాయి. నవంబరుకు సంబంధించి మనదేశంతో పాటు అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను మదుపర్లు గమనించొచ్చు.
గమనించాల్సిన స్టాక్స్..
జైప్రకాశ్ అసోసియేట్స్: మధ్యప్రదేశ్లోని తమ నిల్గ్రీ సిమెంట్ యూనిట్ను విక్రయించే విషయంపై జైప్రకాశ్ అసోసియేట్స్ ఈరోజు బోర్డు సమావేశం నిర్వహించనుంది.
ఎన్డీటీవీ: ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ మొత్తం వాటా 37.44 శాతానికి చేరింది. దీంతో అదానీ గ్రూప్ నుంచి ఇద్దరు డైరెక్టర్లను బోర్డులోకి తీసుకోనున్నట్లు ఎన్డీటీవీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ నెల 23న జరిగే సమావేశంలో నియామక ప్రక్రియను చేపడతామని తెలిపింది.
మహీంద్రా హాలిడేస్: కంపెనీ విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.1,500 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని మహీంద్రా హాలిడేస్ నిర్ణయించింది.
యెస్ బ్యాంక్: కార్లీ గ్రూప్, వెర్వెంటా హోల్డింగ్స్ నుంచి మూలధనాన్ని సమకూర్చుకోవాలన్న యెస్ బ్యాంక్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఆర్బీఐ రెండు లేఖలు పంపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు