Stock Market: సెన్సెక్స్లో 5సెషన్ల వరుస లాభాలకు బ్రేక్.. 17,800 దిగువకు నిఫ్టీ!
Stock Market: సెన్సెక్స్ 334 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. దీంతో సెన్సెక్స్లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. రిలయన్స్, మారుతీ, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగ్గా రావడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుపై కఠినంగా వ్యవహరించొచ్చనే అంచనాలు మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలూ సూచీలను దెబ్బతీశాయి.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 60,847.21 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,847.21- 60,345.61 మధ్య కదలాడింది. చివరకు 334.98 పాయింట్ల నష్టంతో 60,506.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,818.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,823.70- 17,698.35 మధ్య ట్రేడయ్యింది. చివరకు 89.45 పాయింట్లు క్షీణించి 17,764.60 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఎనిమిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, రిలయన్స్, మారుతీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్లోని ఇతర సంగతులు..
☛ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ మినహా అదానీ గ్రూప్నకు చెందిన మిగిలిన అన్ని షేర్లు నేడు లోయర్ సర్క్యూట్ని తాకాయి.
☛ ఆల్ఫాజియో (ఇండియా)కు రూ.15.31 కోట్లు విలువ చేసే ఆర్డర్ దక్కింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 2.83 శాతం లాభపడి రూ.266.75 వద్ద స్థిరపడింది.
☛ ఈజీట్రిప్ ప్లానర్స్ నేడు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. లాభం 4.2 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 4.25 శాతం లాభపడి రూ. 52.70 దగ్గర ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)