Stock Market: లాభాల్లో మార్కెట్ సూచీలు..18,100 ఎగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభంలో ఉన్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 355 పాయింట్ల లాభంతో 60,995 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 102 పాయింట్లు లాభపడి 18,130 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.98 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex) 30 సూచీలో టాటా మోటార్స్, పవర్గ్రిడ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గతవారాన్ని లాభాలతో ముగించాయి. ఆస్ట్రేలియా సూచీలు నేడు 9 నెలల గరిష్ఠానికి చేరడం విశేషం. అమెరికా టెక్ స్టాక్స్లో ర్యాలీ ఇక్కడి మార్కెట్లకు కలిసొచ్చింది. ఆసియా- పసిఫిక్ మార్కెట్లలో ప్రధాన సూచీలు సెలవుల నేపథ్యంలో నేడు పనిచేయడం లేదు. విదేశీ మదుపర్ల క్రయవిక్రయాలు, కార్పొరేట్ ఫలితాలు, రాబోయే బడ్జెట్ అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, గ్లాండ్ ఫార్మా, గ్రావిటా ఇండియా, హెచ్ఎఫ్సీఎల్, జేఅండ్కే బ్యాంక్, జిందాల్ స్టెయిన్లెస్, పూనావాలా ఫిన్కార్ప్, సింజీన్ ఇంటర్నేషనల్, టాటా కమ్యూనికేషన్స్
గమనించాల్సిన స్టాక్స్..
రిలయన్స్ ఇండస్ట్రీస్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రూ.2,20,592 కోట్ల ఆదాయంపై రూ.15,792 కోట్ల నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.23.34) ఆర్జించింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.1,91,271 కోట్ల ఆదాయంపై రూ.18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.28.08) పొందింది. అంటే నికర లాభం 15% తగ్గితే, ఆదాయం 15% పెరిగింది.
ఎల్టీఐమైండ్ట్రీ: డిసెంబరు త్రైమాసికానికి ఎల్టీఐమైండ్ట్రీ ఏకీకృత ప్రాతిపాదికన రూ.1,000.70 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,050.10 కోట్లతో పోలిస్తే ఈసారి 4.6 శాతం తగ్గింది. విలీన సంబంధిత వ్యయాల ప్రభావం పడటం ఇందుకు కారణమైంది. గతేడాది నవంబరులో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్ట్రీ విలీనమై దేశంలోనే ఆరో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఎల్టీఐమైండ్ట్రీ గా అవతరించిన సంగతి తెలిసిందే.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండలోన్ పద్ధతిలో రూ.2,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 అక్టోబరు- డిసెంబరు లాభం రూ.1,085 కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపునకు పైగా పెరిగింది. మొత్తం ఆదాయం రూ.19,454 కోట్ల నుంచి రూ.24,154 కోట్లకు పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంక్: డిసెంబరు త్రైమాసికంలో రూ.8,792 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో బ్యాంకు నమోదు చేసిన రూ.6,536 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 34.5 శాతం అధికం. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.6,194 కోట్ల నుంచి 34.2 శాతం పెరిగి రూ.8,312 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.27,069 కోట్ల నుంచి రూ.33,529 కోట్లకు ఎగబాకింది.
అల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.1,062.58 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22లో ఇదే కాలంలోని రూ.1,710.14 కోట్లతో పోలిస్తే లాభం 37.9 శాతం తగ్గింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.12,984.93 కోట్ల నుంచి 19.53 శాతం పెరిగి రూ.15,520.93 కోట్లకు చేరింది.
యెస్ బ్యాంక్: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో యెస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం 79 శాతం క్షీణించి రూ.55.07 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడం ఇందుకు కారణమైంది. నికర వడ్డీ ఆదాయం 11.7 శాతం పెరిగి రూ.1,971 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 10 శాతం వృద్ధి ఇందుకు దోహదం చేసింది.
కొటాక్ మహీంద్రా బ్యాంక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి స్టాండలోన్ పద్ధతిలో రూ.2,792 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాతో పోలిస్తే ఇది 31 శాతం అధికం. ఆదాయం సైతం రూ.8,260 కోట్ల నుంచి రూ.11,099 కోట్లకు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్