Stock Market: మార్కెట్లకు భారీ లాభాలు.. నిఫ్టీ @ 17,850
Stock Market: సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్లకు పైగా లాభపడింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత మరింత జోరందుకున్నాయి. అదానీ గ్రూప్ (Adani Group) స్టాక్స్కు సంబంధించి వెలువడిన కొన్ని సానుకూల సంకేతాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. ముందస్తు రుణ చెల్లింపులు, సకాలంలో బాండ్ల కూపన్ చెల్లింపుల వంటి పరిణామాలు సానుకూలతలు నింపాయి.
ఈ పరిణామాలతో ఓ దశలో దాదాపు 30 శాతం నష్టపోయిన అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) షేరు భారీగా కోలుకొని చివరకు 2 శాతం నష్టాలతో సరిపెట్టుకుంది. ఈ స్టాక్ ఓ దశలో లాభాల్లోకి ఎగబాకడం గమనార్హం. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సైతం 6.51 శాతం లాభపడింది. మిగిలిన అదానీ నమోదిత కంపెనీలు మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. బ్యాంకులపై అదానీ స్టాక్స్ పతనం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునన్న ప్రభుత్వ ప్రకటన కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.
☛ ఉదయం సెన్సెక్స్ (Sensex) 60,350.01 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,905.34- 60,013.06 మధ్య కదలాడింది. చివరకు 909.64 పాయింట్ల లాభంతో 60,841.88 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,721.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,870.30- 17,584.20 మధ్య ట్రేడయ్యింది. చివరకు 243.65 పాయింట్ల లాభంతో 17,854.05 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.82 వద్ద నిలిచింది.
☛ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో 03 షేర్లు మాత్రమే నష్టపోయాయి. హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్లోని ఇతర సంగతులు..
★ జైడస్ లైఫ్సైన్సెస్ మూడో త్రైమాసిక ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. కంపెనీ నికర లాభం 24.48 శాతం పెరిగింది. కంపెనీ షేరు ఈరోజు 0.44 శాతం పెరిగి రూ. 434.75 వద్ద స్థిరపడింది.
★ దివీస్ ల్యాబ్స్ త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. కంపెనీ షేరు ఈరోజు 12 శాతానికి పైగా కుంగి రూ.2,875 వద్ద ముగిసింది.
★ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టైటాన్ కంపెనీ నికర లాభం 4 శాతం తగ్గింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.07 శాతం నష్టపోయి రూ.2,321.95 వద్ద స్థిరపడింది.
★ మూడో త్రైమాసికంలో జుబిలంట్ ఫుడ్వర్క్స్ ఆదాయ, వ్యయాల్లో రెండంకెల క్షీణత నమోదైన నేపథ్యంలో కంపెనీ షేరు గత రెండు సెషన్లలో 11 శాతానికి పైగా నష్టపోయింది. ఈరోజు షేరు ధర 1.12 శాతం నష్టపోయి రూ.430.70 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 22,100
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 526.02 పాయింట్లు, నిఫ్టీ 143.25 పాయింట్లు పెరిగాయి. -
యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్..
WWDC 2024: యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ తేదీలను ప్రకటించింది. -
28 నుంచి టి+0 సెటిల్మెంట్.. తొలుత ఈ 25 షేర్లకే
T+0 settlement: టి+0 ట్రేడ్ సెటిల్మెంట్ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గురువారం నుంచి అమల్లోకి తీసుకురానున్నాయి. ప్రయోగాత్మకంగా పరీక్షించనున్న దీని బీటా వర్షన్ను తొలుత 25 షేర్లకు వర్తింపజేయనుంది. -
ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
SBI Debit Card Charges: ఏప్రిల్ నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచనుంది. కొత్త ఛార్జీలెలా ఉన్నాయో చూద్దాం..! -
రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్స్పైరింగ్ స్టోరీ
Dhruv Agarwala weight loss journey: ఏకంగా 80 కిలోలు తగ్గడమంటే కష్టమే కదా. కానీ, హౌసింగ్.కామ్ సీఈఓ దాన్ని నిజం చేసి చూపించారు. దానికోసం ఆయన ఏం చేశారో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,066
Stock Market Opening bell: ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. -
‘ఎక్స్’ ప్రీమియంలో కొత్త ఫీచర్.. ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’కు యాక్సెస్
Social Media X: ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం ఎలాన్ మస్క్ మరో కొత్త ఫీచర్ను అందిస్తున్నారు. -
భారత్లో ముకేశ్.. ప్రపంచంలో మస్క్
దేశీయ కుబేరుల్లో అగ్రస్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలబెట్టుకున్నారు. గతేడాదిలో ఆయన సంపద 33 బిలియన్ డాలర్లు (40%) పెరిగి 115 బిలియన్ డాలర్ల (రూ.9.50 లక్షల కోట్ల)కు చేరింది. -
మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. -
ఆనంద్ మహీంద్రా వితరణ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబం ప్రకటించింది. -
ఎల్ఐసీ బ్రాండ్కు తిరుగులేదు
ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో, భారత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది. -
అదానీ చేతికి గోపాల్పుర్ పోర్ట్
ఒడిశాలోని గోపాల్పుర్ పోర్ట్ను రూ.3,350 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ వద్ద రూ.1349 కోట్లకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్కు (ఏపీఎస్ఈజడ్) విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు మంగళవారం వెల్లడించింది. -
3 రోజుల వరుస లాభాలకు విరామం
సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
ప్రపంచ 500 మంది కుబేరుల్లో ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అన్నీ కలిసొస్తున్నట్లున్నాయి. తాజాగా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ప్రపంచంలోనే తొలి 500 మంది సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
సెమీకండక్టర్ ప్లాంట్లో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ రూ.5,000 కోట్ల పెట్టుబడులు
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పెట్టుబడులున్న ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్, మహారాష్ట్రలోని సెమీకండక్టర్ ప్లాంట్లో వచ్చే అయిదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. -
హైదరాబాద్లో ‘స్టోరబుల్ ఇంక్’ విస్తరణ
అమెరికాకు చెందిన సెల్ఫ్-స్టోరేజ్ టెక్నాలజీ సేవల సంస్థ అయిన స్టోరబుల్ ఇంక్., హైదరాబాద్లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. -
ఇండోసోల్లో ఉత్పత్తి 31న ప్రారంభం
సౌర విద్యుత్ కేంద్రాలకు అవసరమైన మాడ్యూల్స్, ప్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేసే ఇండోసోల్ సోలార్, తన ఉత్పత్తి ప్లాంటు తొలి దశను ఈ నెల 31న ప్రారంభించనుంది. -
తగ్గిన కరెంట్ ఖాతా లోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో మన దేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 10.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,000 కోట్ల)కు పరిమితమైంది. -
జనరల్ మోటార్స్ వ్యవస్థాపక డైరెక్టర్ టి.ఎన్. సుబ్రమణియమ్ కన్నుమూత
భారత సంతతికి చెందిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, అమెరికా వాహన దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) వ్యవస్థాపక డైరెక్టర్ అయిన డాక్టర్ టి.ఎన్. సుబ్రమణియమ్(76) కన్నుమూశారు. -
సంక్షిప్తవార్తలు(5)
విప్రో జీఈ హెల్త్కేర్ వచ్చే 5 ఏళ్లలో దేశంలో రూ.8,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
-
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
-
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
-
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు