Stock Market Closing Bell: స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి...
ముంబయి: గురువారం ఆద్యంతం నష్టాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు చివరి అరగంటలో లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, గత వరుస సెషన్ల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ మార్కెట్లను మధ్యాహ్నం వరకు కలవరపెట్టాయి. అయితే, చమురు ధరల తగ్గుదల, రూపాయి స్థిరంగా కొనసాగుతుండడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, బలమైన కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో సూచీలకు దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు క్రమంగా పుంజుకుంటూ వచ్చాయి.
★ నిఫ్టీ ఉదయం 17,898.65 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,968.45 వద్ద గరిష్ఠాన్ని, 17,852.05 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 20.95 పాయింట్ల స్వల్ప లాభంతో 17,965.20 వద్ద స్థిరపడింది. 60,080.19 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 60,341.41 - 59,946.44 మధ్య కదిలింది. చివరకు 37.87 పాయింట్ల స్వల్ప లాభంతో 60,298.00 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.67 వద్ద నిలిచింది.
★ సెన్సెక్స్ 30 సూచీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్, టైటన్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
మార్కెట్లోని ఇతర విశేషాలు..
☞ బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈరోజు రాణించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.3.5 లక్షల కోట్లు, అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ.1.5 లక్షల కోట్లు దాటింది. ఇంట్రాడేలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 5 శాతానికి పైగా ఎగబాకి రూ.3,146 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి.
☞ పాలసీబజార్ మాతృసంస్థ పీబీఫిన్టెక్ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం మేర నష్టపోయాయి. చివరకు 1.54 శాతం దిగజారి రూ.563 వద్ద స్థిరపడింది. తమ కంపెనీ లాభాల్లో రావడానికి మరో 3-4 ఏళ్లు పట్టొచ్చని సంస్థ ప్రకటించడమే దీనికి కారణం.
☞ హెచ్ఏఎల్ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోనూ తమ కార్యాలయం తెరవనున్నట్లు హెచ్ఏఎల్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?