Stock Market Closing Bell: ఆద్యంతం లాభాలమయం.. సెన్సెక్స్ 59,300+
Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి...
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో ఉదయం నుంచి ఎక్కడా లాభాల జోరు తగ్గలేదు. ఆరంభం నుంచీ కొనుగోళ్ల మద్దతు స్థిరంగా కొనసాగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం జూన్తో పోలిస్తే దిగిరావడం సూచీల సెంటిమెంటును పెంచింది. పైగా అంచనాల కంటే కూడా తక్కువ నమోదు కావడం మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇదే కారణంతో అంతర్జాతీయంగానూ అన్ని మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. మరోవైపు దేశీయంగానూ బలమైన కార్పొరేట్ ఫలితాలు, ముడి చమురు ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం, డాలర్ ఇండెక్స్ దిగిరావడం సూచీలకు కలిపొచ్చింది.
* నిఫ్టీ ఉదయం 17,711.65 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,719.30 వద్ద గరిష్ఠాన్ని, 17,631.95 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 124.25 పాయింట్ల లాభంతో 17,659.00 వద్ద స్థిరపడింది. 59,320.45 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 59,484.99 - 59,251.14 మధ్య కదిలింది. చివరకు 515.31 పాయింట్లు లాభంతో 59,332.60 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.57 వద్ద ట్రేడయ్యింది.
* సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్బీఐ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటన్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్యూఎల్, మారుతీ, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర విశేషాలు..
* కిర్లోస్కర్ న్యూమాటిక్ షేర్లు ఈరోజు ఏడు శాతం మేర లాభపడ్డాయి. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాల్లో 130.13 శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు కారణం.
* జూన్ త్రైమాసికంలో వండర్లా హాలిడేస్ బలమైన కార్పొరేట్ ఫలితాలను ప్రకటించింది. నికర లాభాలు రూ.8.51 కోట్ల నుంచి రూ.64.38 కోట్లకు చేరాయి. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 20 శాతం పెరిగి రూ.334.95 వద్ద అప్పర్ సర్క్యూట్ని తాకాయి.
* ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పీబీ ఫిన్టెక్ (పాలసీబజార్) ఆదాయం 100 శాతం పెరిగిన నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 5 శాతానికి పైగా లాభపడ్డాయి.
* ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 2 శాతం మేర లాభపడి 52 వారాల గరిష్ఠానికి చేరాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.ఆరు లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన ఏడో భారత కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచింది. ఈ కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటి వరకు 17 శాతం ఎగబాకింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’