dollar: డాలర్ నవ్వింది..! ప్రపంచానికి ముచ్చెమటలు..!
డాలర్ ఎన్నడూ లేని విధంగా బలపడుతోంది.. కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు.. ఆ దేశ జీడీపీ, ద్రవ్యోల్బణం సూచీలు ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలు
* రూపాయి విలువ రికార్డు స్థాయి పతనం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
డాలర్ ఎన్నడూ లేని విధంగా బలపడుతోంది.. కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు.. ఆ దేశ జీడీపీ, ద్రవ్యోల్బణం సూచీలు ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలు విలువను కోల్పోతున్నాయి. ఇటీవల పౌండ్, యూరో వంటి కరెన్సీలు డాలర్తో పోలిస్తే భారీగా విలువ కోల్పోయాయి. మరో వైపు భారత రూపాయి పతనమై దాదాపు వారం వ్యవధిలోనే రూ.82 సమీపంలోకి చేరింది. వరుసగా ఏడు వారాల నుంచి భారత్ విదేశీ మారకపు నిల్వలు కుంగుతూ రెండేళ్ల అత్యల్పానికి చేరాయని ఇటీవల ఆర్బీఐ వెల్లడించడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. వాస్తవానికి గతేడాది నుంచి డాలర్ క్రమంగా బలపడుతూ వస్తున్నా.. ఇటీవల కాలంలో దీని వేగం పెరిగిపోయింది.
డాలర్ స్మైల్..!
ఆర్థికవేత్తలు, ఈక్విటీ వ్యూహకర్తలు ప్రస్తుతం డాలర్ పెరుగుదలను ‘డాలర్ స్మైల్’ థియరీతో అన్వయించి చూస్తున్నారు. ఈ సూత్రాన్ని ఐఎంఎఫ్ మాజీ ఆర్థికవేత్త స్టీఫెన్ జెన్ ప్రస్తావించారు. దీని ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు గానీ లేదా అత్యంత బలహీనంగా (ద్రవ్యోల్బణం, భయాందోళనలు) ఉన్నప్పుడు గానీ.. ప్రపంచ వృద్ధి మందగించినప్పుడు గానీ.. డాలర్ విలువ బాగా పెరుగుతుంది. మదుపర్లు ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అస్థిరత నుంచి తమ పెట్టుబడులను కాపాడుకోవడం కోసం డాలర్ను ఎంచుకొంటారు. సాధారణంగా డాలర్ పెరుగుదలను ‘డీఎక్స్వై’(DXY) సూచీ ఆధారంగా తెలుసుకొంటారు. ప్రస్తుతం దీని ప్రకారం డాలర్ డిమాండ్ గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉందని అర్థమవుతోంది.
అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. దీనికి తోడు ఆ దేశ కరెన్సీ డాలరే ప్రపంచంలో అతిపెద్ద రిజర్వు నగదుగా చలామణీ అవుతోంది. అంతర్జాతీయ వర్తకానికి ఇదే ఆక్సిజన్. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం 149 దేశాలు 7 ట్రిలియన్ల మేరకు డాలర్ల రిజర్వులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఏం జరిగినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుంది. ప్రస్తుతం అమెరికా 40 ఏళ్లలోనే అతి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. దీనిని అదుపు చేయడానికి ఫెడ్ వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతోంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చనే భయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంపై పెను ప్రభావం చూపించవచ్చు. డాలర్ విలువ తక్కువ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు బలంగా ఉన్నాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల సూచీ ఎంఎస్సీఐ ఈఎం 2021 ఫిబ్రవరిలో 1446 పాయింట్లు ఉండగా.. అక్కడి నుంచి 31శాతం కుంగి సెప్టెంబర్ 2022 నాటికి 906 పాయింట్లకు చేరింది. అదే సమయంలో డీఎక్స్వై 90 నుంచి 113 పాయింట్లకు చేరింది.
డాలర్ విలువ పెరుగుదలకు కారణాలు
* అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు
* అత్యధిక వడ్డీరేట్లను సుదీర్ఘ కాలం ఉంచుతామని ఫెడ్ ఛైర్మన్ జోరమ్ పావెల్ పేర్కొనడం
* ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే అమెరికా ఫెడ్ వేగంగా వడ్డీ రేట్లను పెంచుతోంది. మిగిలిన దేశాల వడ్డీరేట్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది డాలర్కు బలంగా మారింది.
* సుదీర్ఘ కాలం నుంచి జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపు నెడుతోంది. ఇది చాలా కమోడిటీ మార్కెట్లలో ధరలను పెంచేస్తోంది. ఇది దవ్యోల్బణానికి దారి తీస్తోంది. ఐరోపాకు గ్యాస్ సరఫరా కోత భయాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.
* అమెరికా ఆర్థికంగా, సైనికంగా సూపర్ పవర్. అతిపెద్ద నగదు మార్కెట్. డాలర్ ప్రపంచ కరెన్సీ. ఇవన్నీ పెట్టుబడులకు అనుకూలమైన వేదికను సృష్టించాయి. ఫలితంగా డాలర్ విలువ పెరుగుతోంది.
కరుగుతున్న భారత్ ఫారెక్స్ రిజర్వు..
గత వారం రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం మన ఫారెక్స్ రిజర్వు కుంగి 545 బిలియన్ డాలర్లకు చేరింది. రష్యా యుద్ధం మొదలైన నాటితో పోలిస్తే ఏకంగా 86 బిలియన్ డాలర్ల మేరకు ఈ నిల్వలు కరిగిపోయాయి.
* భారత్ దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువ. భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. వీటికి డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉండటం భారంగా మారింది. డాలర్ పోటు తట్టుకోవడానికి ఇటీవల భారత్-సౌదీ రూపాయల్లో ట్రేడింగ్ చేయడంపై కూడా చర్చించాయి.
* పడిపోతున్న రూపాయి విలువ కాపాడేందుకు ఆర్బీఐ కొన్ని డాలర్లను విక్రయించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తున్నాయి.
* ఫారెన్ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి వైదొలగడం కూడా డాలర్ ధరను పెంచేస్తోంది. తాజాగా రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠమైన రూ.81.93కు చేరింది. కాకపోతే భారత ఎగుమతి దారులు ఈ పరిస్థితుల్లో లబ్ధిపొందుతారు.
అమెరికా సహా ప్రపంచానికి ఇబ్బందే..
డాలర్ విలువ పెంపు అమెరికాకు అయాచిత వరమేమీకాదు. అమెరికా మల్టీ నేషనల్ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ. విదేశీ కరెన్సీల్లో సంపాదించిన మొత్తాన్ని డాలర్లలోకి మారిస్తే తక్కువ మొత్తం లభిస్తుంది.
* అమెరికా ఎగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. ఇది అక్కడి దేశీయ తయారీదార్లకు శరాఘాతంగా మారుతుంది.
* విదేశాల నుంచి అమెరికా వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. వారి కరెన్సీలకు తక్కువ డాలర్లు లభించడమే దీనికి ప్రధాన కారణం.
ఫారెక్స్ ఇబ్బందుల్లో యూకే..?
అమెరికా ఆత్మీయ దేశమైన యూకేలో కరెన్సీ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది. ఇటీవల బ్రిటన్ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోతోంది. దీనిని అడ్డుకోవడానికి కూడా బ్రిటన్ ఎదుట చాలా స్వల్ప మార్గాలు మాత్రమే ఉన్నాయి. జపాన్ వంటి దేశాలు సొంత కరెన్సీలను కొనుగోలు చేసి విలువను కాపాడుకొంటాయి. ఎందుకంటే వాటి వద్ద డాలర్లు విదేశీ కరెన్సీ నిల్వల రూపంలో ఉంటాయి. కానీ, బ్రిటన్కు ఆ అవకాశం లేదు. బ్రిటన్ వద్ద కేవలం 80 బిలియన్ల డాలర్ల మేరకు మాత్రమే ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు కూడా 12 నెలల నుంచి పతనం అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పౌండ్ పతనాన్ని కాపాడటానికి ఇవి ఏమాత్రం చాలవు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఆధారంగా ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంటుంది. కానీ, విదేశీ రిజర్వుల పరిమాణాల్లో బ్రిటన్ది 18వ స్థానం. బ్రిటన్ ఫారెక్స్ రిజర్వుల్లో మొత్తం 43.8శాతం మాత్రమే డాలర్లు, యూరోలు. మిగిలినవి ఐఎంఎఫ్ రైట్స్, జపాన్ యెన్, చైనా యువాన్, బంగారం తదితర రూపంలో ఉన్నాయి. దీంతో పౌండ్ పతనం ఆపడంపై యూకే మల్లగుల్లాలు పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే