Stryder e-bike: టాటా గ్రూప్ నుంచి ఇ-బైక్.. ధర, పూర్తి వివరాలు ఇవే..
Tata e-bike: మార్కెట్లో మరో కొత్త ఇ-బైక్ వచ్చింది. టాటా గ్రూప్నకు చెందిన స్ట్రైడర్ కంపెనీ దీన్ని తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్లోకి మరో కొత్త ఇ-బైక్ అందుబాటులోకి వచ్చింది. టాటా గ్రూప్నకు చెందిన స్ట్రైడర్ (e-bike) కంపెనీ జీటా ఇ-బైక్ను నూతనంగా లాంచ్ చేసింది. దీని అసలు ధర రూ.31,999. పరిమిత కాలపు ఆఫర్ కింద 20% డిస్కౌంట్తో రూ.25,599కే ఇ-బైక్ లభిస్తోంది. ఈ ఇ-బైక్ కంపెనీ వెబ్సైట్లో ఆకుపచ్చ, బూడిద రంగుల్లో అందుబాటులో ఉంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. స్ట్రైడర్ జీటాలో 36V, 250 W BLDC రేర్ హబ్ మోటార్ అమర్చారు. ఈ ఇ-బైక్ ఫ్రేమ్ లోపల లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. దీన్ని 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సింగిల్ ఛార్జ్తో హైబ్రిడ్ రైడ్ మోడ్లో (పెడల్ సాయంతో) 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. పెడల్ సాయంతో లేకుండా గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఒక కిలోమీటర్ ప్రయాణానికి 10 పైసలు ఖర్చవుతుందని పేర్కొంది. ఇ-బైక్ కావాలనుకునేవారు స్ట్రైడర్ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. మీ ప్రాంతానికి డెలివరీ ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి
-
India News
Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
-
India News
Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!