మీ సంస్థకు మీ పాన్ కార్డు వివరాలు ఇవ్వకపోతే ఏమి జరుగుతుంది?
ఆదాయ పన్ను చట్టం ప్రకారం అందరు ఉద్యోగులు అందరు తమ పాన్ కార్డును పనిచేసే సంస్థలో ఇస్తేనే టీడీఎస్ మినహాయించేందుకు వీలుంటుంది. టీడీఎస్ దాఖలు చేసేటప్పుడు పాన్ లేదా ఆధార్ వివరాలు అందించడం సంస్థ బాధ్యత. మీరు ఆదాయపు పన్ను శాఖ TRACES పోర్టల్ ద్వారా టీడీఎస్ స్థితిని తనిఖీ చేయవచ్చు...
ఆదాయ పన్ను చట్టం ప్రకారం అందరు ఉద్యోగులు అందరు తమ పాన్ కార్డును పనిచేసే సంస్థలో ఇస్తేనే టీడీఎస్ మినహాయించేందుకు వీలుంటుంది. టీడీఎస్ దాఖలు చేసేటప్పుడు పాన్ లేదా ఆధార్ వివరాలు అందించడం సంస్థ బాధ్యత. మీరు ఆదాయపు పన్ను శాఖ TRACES పోర్టల్ ద్వారా టీడీఎస్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
పాన్ కార్డు 5 నిబంధనలు
- మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206AA కింద మీ యజమాని తీసివేసేందుకు టీడీఎస్ లేనందున మీరు పాన్ లేదా ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి, రూ. 2.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంది.
- మీరు మీ పాన్ కార్డు వివరాలను అందించడంలో విఫలమైతే, మీ యజమాని టీడీఎస్ను 20% లేదా అంతకంటే ఎక్కువ రేటుతో తీసివేస్తారు. ఏదేమైనా, సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ కోసం లెక్కించిన ఉద్యోగి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే టీడీఎస్ వర్తించదు.
- గతేడాది నుంచి పాన్ బదులుగా ఆధార్ సమర్పించే అవకాశం ఉంది. కానీ అలా చేసే ముందు, పాన్- ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
- పాన్కు బదులుగా మీ ఆధార్ నంబర్ను ఇచ్చినప్పుడు, తప్పు సంఖ్య ఇవ్వడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 272 బి కింద రూ. 10,000 జరిమానా పడుతుంది.
- మీ యజమానికి పాన్ అందించడంలో మీరు విఫలమైతే, ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా రీఫండ్ పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి