సర్వేయర్లు ఎప్పుడు వస్తారంటే..!
బీమా సంబంధిత క్లెయింల విషయంలో సర్వేయర్ల పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం.
బీమా పాలసీలు వివిధ రకాలు. వ్యక్తుల అవసరాలకు తగినట్టు, వారి జీవితంలోని వివిధ దశలకు అనుగుణంగా రక్షణ కల్పించేదాన్ని బట్టి వివిధ రకాల పాలసీలు అందుబాటులో ఉంటాయి. కేవలం జీవిత, ఆరోగ్య బీమాలే కాదు… చాలా మంది తమ ఇంటి సంరక్షణకు, వ్యాపారంలో భాగంగా వాడే ఉపకరణాలకు బీమా తీసుకుంటారు.
క్లెయిం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాస్తవంగా కలిగే నష్టాన్ని అంచనా వేయడంలో పాలసీదారుకు, బీమా సంస్థకు మధ్య వ్యత్యాసాలు రావచ్చు. అదేవిధంగా సాధారణ బీమా పాలసీకి సంబంధించి క్లెయిం చేసే సొమ్ము పరిమితికి మించి ఉన్నట్లుగా అనిపిస్తే బీమా సంస్థలు నష్టాన్ని అంచనా వేసేందుకుగాను సర్వేయర్ను నియమిస్తాయి.
స్వతంత్రంగా వ్యవహరిస్తారు
సర్వేయర్ స్వతంత్రంగా వ్యవహరించి నష్టాన్ని అంచనా వేసి నివేదికను అటు బీమా సంస్థకు ఇటు పాలసీదారుకు ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణ బీమా క్లెయింల విషయంలో సర్వేయర్ల పాత్ర కీలకమైనది . వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
వారి నియామకానికి అర్హతలుంటాయి
-
వాస్తవానికి సర్వేయర్ బీమా సంస్థకు, పాలసీదారుకు మధ్య వృత్తిపరమైన మాధ్యమంలా పనిచేస్తారు.
-
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నియమాలను అనుసరించి ఎవరైనా వ్యక్తి, లేదా కార్పొరేట్ సంస్థ సర్వేయర్గా వ్యవహరించవచ్చు. ఇందుకు దరఖాస్తు చేసుకొని ఐఆర్డీఏఐ నియమాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.
-
వివిధ రకాల సర్వేయర్లకు ఉండాల్సిన నిర్దిష్ట అర్హతలపై ఐఆర్డీఏఐ స్పష్టతనిచ్చింది.
-
ఉదాహరణకు, వాహన బీమాకు సర్వేయర్గా నియమితులు కావాలంటే ఆ వ్యక్తి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడై ఉండాలి. మెరైన్ ఇన్సూరెన్స్ సర్వేయర్గా వ్యవహరించేందుకు మెరైన్ ఇంజనీరింగ్ లేదా నేవీ ఆర్కిటెక్చర్ చదివి ఉండాలి. క్రాప్ ఇన్సూరెన్స్ కోసం వ్యవసాయ డిగ్రీ ఉన్నవారినే తీసుకునేలా ఐఆర్డీఏఐ నిబంధనలు విధించింది.
-
దేశంలోని సర్వేయర్ల జాబితాను ఐఆర్డీఏఐ వెబ్సైట్లో ఉంచుతుంది.
రంగంలోకి దిగేది అప్పుడే…
-
రూ.50వేలకు పై బడిన వాహన బీమా క్లెయిం చేసినప్పుడు, రూ.1లక్ష పైన అగ్నిప్రమాదం, గృహ బీమా క్లెయింల లాంటివి చేసినప్పుడు సర్వేయర్లు రంగంలోకి దిగుతారు.
-
ఈ రూ.50వేలు, రూ.లక్ష పరిమితులను ప్రతి మూడేళ్ల కోసారి ఐఆర్డీఏఐ సమీక్షించి తగిన మార్పులు చేస్తుంది.
-
సర్వేయర్ అందించిన నివేదికనే ప్రామాణికంగా తీసుకొని పరిహారాన్ని బీమా సంస్థలు కల్పించాలనేం లేదు. అయితే పాలసీదారు బీమా సంస్థ ఇచ్చే పరిహారంతో సంతృప్తి చెందకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ను సంప్రదించే వీలుంది.
పాలసీదారు కూడా నియమించుకోవచ్చు
-
టెక్నికల్గా… పాలసీదారు కూడా సర్వేయర్ను నియమించుకోవచ్చు. అయితే అది భారం కావచ్చు. సర్వేయర్లకు సంబంధించి పాలసీల్లో ఉండే నిబంధనలకు అనుగుణంగా వారిని నియమించుకోవాలంటే సామాన్య పాలసీదారులకు కష్టమే.
-
బీమా సంస్థలు వ్యవస్థాగత పనులు చేపడుతుంటాయి. అందులో భాగంగా సర్వేయర్లను నియమిస్తుంటాయి. వారికి నైపుణ్యాలకు ఫీజు కూడా చెల్లింస్తుంటారు. మనం ఒక వేళ సర్వేయర్లను నియమించుకోవాలంటే వారికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నివేదిక సమర్పణకు గడువు
-
నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వేయర్ ను ఎంపిక చేశాక 30 రోజుల్లోగా బీమా సంస్థకు నివేదిక అందించాలి.
-
అవసరమైతే మరింత గడువును సర్వేయర్ కోరవచ్చు. అయితే బీమా సంస్థకు ఈ విషయాన్ని తెలియజేయాలి.
-
గడువుతో సంబంధం లేకుండా క్లెయిం చేసిన ఆరు నెలలలోపు సర్వేయర్ తుది నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.
-
బీమా సంస్థ సర్వేయర్ ఇచ్చిన నివేదిక అసంపూర్ణంగా ఉందని భావిస్తే దాన్ని తిరిగి సమీక్షించేందుకు లేదా పూర్తి నివేదిక ఇచ్చేందుకు మూడు వారాల గడువు ఇస్తుంది.
పాలసీదారులు చేయాల్సిందేమిటి?
-
వాహన బీమా క్లెయిం రూ.50వేలకు మించి ఉన్నట్లయితే, లేదా ఇతర సాధారణ బీమా క్లెయిం రూ.1లక్ష పైబడి ఉంటే సంఘటనకు సంబంధించి అన్ని రికార్డులను సిద్ధం చేసుకొని ఉండాల్సిన బాధ్యత పాలసీదారుదే.
-
ప్రమాదం లేదా సంఘటన జరిగిన ప్రదేశాన్ని, అక్కడ జరిగిన సన్నివేశాలను డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పాలసీదారులే.
ఘటనకు సంబంధించి సర్వేయర్ కు అన్ని రకాలుగా సహాయపడే బాధ్యతను పాలసీదారులు తీసుకోవాలి.
(Source: LiveMint)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ