SVB Crisis: 10 రోజుల ముందే షేర్లు అమ్మేసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చీఫ్
Silicon Valley Bank: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభానికి ముందే ఆ బ్యాంక్ సీఈఓ తన షేర్లను విక్రయించినట్లు తెలిసింది. 10 రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సహా ఇతర మార్కెట్లలో బ్యాంకింగ్ స్టాక్స్ పతనానికి కారణమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) విషయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ సంక్షోభం తలెత్తడానికి కొద్ది రోజుల ముందే బ్యాంక్ చీఫ్, సీఈవో గ్రెగ్ బెకర్ తన షేర్లు అమ్ముకున్నారని తెలిసింది. ఎస్వీబీ మాతృ సంస్థ అయిన ఎస్వీబీ ఫైనాన్షియల్లో ఉన్న 3.6 బిలియ్ డాలర్ల విలువైన 12,451 షేర్లను ఫిబ్రవరి 27న విక్రయించారని ఆ గ్రూప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. షేర్ల విక్రయానికి అనుమతి ఇవ్వాలని జనవరి 26నే నియంత్రణ సంస్థలను బెకర్ కోరినట్లు వెల్లడైంది. బ్యాంకింగ్ సంక్షోభానికి కొద్ది రోజుల ముందే బెకర్ తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై అటు బెకర్గానీ, ఎస్వీబీ గ్రూప్ గానీ అధికారికంగా స్పందించలేదు. బ్యాంకులో వాటాల విక్రయం ప్రతిపాదన గురించి బెకర్కు ముందే తెలుసా అనేదీ తెలియరాలేదు.
Also Read: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కలకలం
ఎవీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్లకు నిధులు సమకూరుస్తుంటుంది. నష్టాలను పూడ్చుకోవడం, పోర్ట్ఫోలియోను బలోపేతం చేసేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించడంతో పాటు 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ గురువారం ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చనీ పేర్కొంది. దీంతో బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. గురువారం ఏకంగా ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేర్లు ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్ల డాలర్ల నష్టం వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్ను నిలిపివేయడంతో పాటు బ్యాంక్ను అక్కడి నియంత్రణ సంస్థలు మూసివేశాయి. ఆస్తులనూ జప్తు చేశాయి.
నేను కొంటా: మస్క్
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. సంక్షోభంలో ఉన్న బ్యాంక్ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎస్వీబీని డిజిటల్ బ్యాంక్గా మారుస్తానంటూ ట్వీట్ చేశాడు. ‘ఎస్వీబీని ట్విటర్ కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్గా మార్చాలి’ అంటూ ఎలక్ట్రానిక్ కంపెనీ రేజర్ సీఈవో మిన్-లియాంగ్ టన్ ట్వీట్ చేయగా.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే