TATA Group: ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల పెట్టుబడులు.. టాటా గ్రూప్ భారీ ప్రణాళికలు!
వచ్చే ఐదేళ్లలో దాదాపు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యాన్ని టాటా గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం...
ఇంటర్నెట్ డెస్క్: అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత వ్యాపార స్వరూపాల్నే మార్చేస్తోంది. ఇంధనం, కమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, రవాణా సహా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అవకాశాల్ని చేజార్చుకోకుండా దేశీయ కంపెనీలు జాగ్రత్తపడుతున్నాయి. కొత్త పోకడలకు అనుగుణంగా వ్యూహాల్ని రచిస్తున్నాయి. నూతన రంగాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్ల పాటు ప్రపంచ వేదికపై భారత్ హవా కొనసాగనుందన్న అంచనాలకు అనుగుణంగా దేశీయ కంపెనీలు తమని తాము తీర్చిదిద్దుకుంటున్నాయి. ఈ మేరకు భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించాయి.
అంబానీ, అదానీలను మించి టాటా...
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో వివిధ రంగాల్లో 55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం 75 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించింది. తాజాగా ఈ జాబితాలో మరో దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ కూడా చేరింది. ఈ కంపెనీ ఏకంగా 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.18 లక్షల కోట్లు) పెట్టుబడుల్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొబైల్ పరికరాల తయారీ, సెమీకండక్టర్లు, విద్యుత్తు వాహనాలు, బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఇ-కామర్స్ రంగాల్లోకి వీటిని మళ్లించనుంది. ఇటీవల ‘ది ఎకానమిస్ట్’కు ఇచ్చిన ముఖాముఖిలో టాటా గ్రూప్ సంస్థల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఈ వివరాలను పంచుకున్నారు. టాటా గ్రూప్ దేశీయ విపణిపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
ఐఫోన్తో మొబైల్ పరికరాల తయారీలోకి..
యాపిల్కు పరికరాలను సరఫరా చేసే తైవాన్ సంస్థ విస్ట్రన్ కార్ప్తో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విస్ట్రన్తో కలిసి భారత్లో ఎలక్ట్రానిక్స్ ప్లాంటు నెలకొల్పి, అందులో ఐఫోన్ల అసెంబ్లింగ్ చేపట్టాలని టాటా గ్రూపు భావిస్తోందని సమాచారం. విస్ట్రన్తో ఒప్పందానికి సంబంధించి టాటాల చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. టాటా గ్రూపు భారత్లోని విస్ట్రన్ కార్యకలాపాల్లో వాటా కొనుగోలు చేస్తుందా లేదంటే కొత్త అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై టాటా గ్రూప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వచ్చే ఐదేళ్లలో 60% స్వచ్ఛ ఇంధనం..
మరోవైపు దేశవ్యాప్తంగా 350 జాతీయ రహదారుల వెంట 450 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ వెల్లడించింది. 2023 నాటికి ఈ సంఖ్యను 6,500 పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో టాటా వపర్ హరిత ఇంధన రంగంలో రూ.75,000 కోట్లు వెచ్చించనున్నట్లు చంద్రశేఖరన్ తాజాగా వెల్లడించారు. దీంట్లో రూ.10,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలోనూ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా టాటా గ్రూప్ ముందుకు సాగుతోంది. గత ఏడాది కొత్తగా 707 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించుకుంది. దీంతో కంపెనీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యంలో హరిత, స్వచ్ఛ ఇంధన వాటా 34 శాతానికి చేరినట్లు ఛైర్మన్ తెలిపారు. ఈ వాటాను వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పెంచుకోనున్నట్లు వెల్లడించారు.
తమిళనాడులో ప్లాంటు..
తమిళనాడులోని కృష్ణగిరిలో మొబైల్ఫోన్ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కేంద్రంలోనే తాజాగా ఐఫోన్ తయారీని కూడా చేపట్టేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో తమిళనాడులో దాదాపు 20 వేల ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత