Tata Motors: పెరిగిన టాటా మోటార్స్ కార్ల ధరలు
ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన ధరలను పెంచింది....
ముంబయి: ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన ధరలను పెంచింది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు గరిష్ఠంగా 1.1 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొంది. ఇటీవల మారుతీ సుజుకీ, బీఎండబ్ల్యూ సహా పలు వాహన సంస్థలు ధరలు పెంచిన విషయం తెలిసిందే. సెమీకండక్టర్ల కొరతతో పాటు పలు కీలక లోహాలు అందుబాటులో లేకపోవడం వాహన పరిశ్రమకు గతకొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య