Tata Motors: టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరల పెంపు.. ఎంతంటే?
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు 2-2.5 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది.....
దిల్లీ: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు 2-2.5 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. స్టీల్, అల్యూమినియం సహా ఇతర కీలక లోహాలతో పాటు ముడి సరకు ధరలు పెరగడమే విక్రయ ధరల పెంపునకు కారణమని వివరించింది. వినియోగదారులపై భారాన్ని మోపకుండా ఉండేందుకు కంపెనీలో అంతర్గతంగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ పెంపు తప్పలేదని తెలిపింది. గతవారం మెర్సిడెజ్ బెంజ్ సైతం ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్