iPhone: ఐఫోన్ తయారీ దిశగా వడివడిగా ‘టాటా’ అడుగులు!
బెంగళూరులో విస్ట్రోన్కు చెందిన ఐఫోన్ తయారీ కేంద్రాన్ని చేజిక్కించుకునే దిశగా టాటా గ్రూప్ వడి వడిగా అడుగులు వేస్తోంది.
దిల్లీ: భారత్లోనూ ఐఫోన్లు (iPhone) తయారవుతున్నప్పటికీ.. వాటిని విదేశీ కంపెనీలే చేపడుతున్నాయి. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ దేశీయంగా తయారీ కేంద్రాలను నెలకొల్పి యాపిల్ (Apple) ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నాయి. అయితే, టాటా గ్రూప్ (TATA Group) తొలి దేశీయ ఐఫోన్ (iPhone) తయారీ కంపెనీగా నిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విస్ట్రోన్తో ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. బెంగళూరుకు సమీపంలో ఉన్న విస్ట్రోన్ కేంద్రంలో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు టాటా గ్రూప్ (TATA Group) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మార్చి ఆఖరు కల్లా..
విస్ట్రోన్ సాయంతో తయారీ కార్యకలాపాలను పూర్తిగా చేజిక్కించుకోవాలన్నది టాటా గ్రూప్ యోచనగా తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనాకు పోటీ ఇవ్వాలన్న భారత ప్రణాళికలకు టాటా గ్రూప్ చేస్తున్న యత్నాలు దన్నుగా నిలవనున్నాయి. మార్చి 31 నాటికి టాటా- విస్ట్రోన్ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ డీల్ ఖరారైతే ఐఫోన్ల తయారీని ‘టాటా ఎలక్ట్రానిక్స్’ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే తయారీ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా టాటా గ్రూప్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.
విస్ట్రోన్ అందుకే విక్రయిస్తోందా?
తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ భారత్లో ఐఫోన్ తయారీని చేపడుతున్నాయి. అయితే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం సర్వర్ల తయారీ వంటి ఇతర విభాగాలకూ విస్తరించే యోచనలో విస్ట్రోన్ ఉంది. ఈ క్రమంలోనే భారత్లో ఐఫోన్ తయారీ నుంచి నిష్క్రమించాలని భావిస్తోందని సమాచారం. బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో విస్ట్రోన్ తయారీ కేంద్రం ఉంది. ఒకవేళ ఒప్పందం ఖరారైతే.. ఎనిమిది ఐఫోన్ తయారీ లైన్లు టాటా చేతికి వెళ్లనున్నాయి. 10,000 మంది కార్మికులు కూడా టాటా గ్రూప్ యాజమాన్యం కింద పనిచేయనున్నారు.
యాపిల్- టాటా బంధం బలోపేతం..
యాపిల్తో సంబంధాలను టాటా మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇప్పటికే హోసూర్లో ఐఫోన్లో ఉపయోగించుకునే పరికరాలను తయారు చేస్తోంది. ఇటీవలే అక్కడ భారీ ఎత్తున నియామకాలను చేపట్టింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్లోనే టాటా కొత్తగా ఐఫోన్ తయారీ లైన్లనూ జత చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లనూ ప్రారంభించనున్నట్లు ఇప్పటికే టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలోనే ముంబయిలో తొలి స్టోర్ తెరవనున్నట్లు ఇటీవలే తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..