2025 నాటికి 10 కొత్త విద్యుత్ వాహనాలు
దేశీయంగా 2025 నాటికి 10 కొత్త బ్యాటరీ విద్యుత్ వాహనాలను (బీవీఈలు) తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదార్లకు వెల్లడించారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్ అందించే ప్రపంచ అగ్రగామి.....
టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్
దిల్లీ: దేశీయంగా 2025 నాటికి 10 కొత్త బ్యాటరీ విద్యుత్ వాహనాలను (బీవీఈలు) తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదార్లకు వెల్లడించారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్ అందించే ప్రపంచ అగ్రగామి సంస్థల్లో టాటా మోటార్స్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సెల్, బ్యాటరీ తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు.దేశ వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక వసతుల్ని పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామ’ని చంద్రశేఖరన్ తెలిపారు. నెక్సాన్ ఈవీలను గత ఏడాది విడుదల చేయగా, ఇప్పటివరకు 4,000 వాహనాలను విక్రయించింది.2020-21 లో కంపెనీ అత్యధిక వార్షిక విక్రయాలు నమోదు చేసింది. దీంతో మార్కెట్ వాటాను 8.2 శాతానికి పెంచుకోగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా