tax news: ఐటీ రిటర్న్‌ల గడువు పెంచండి..!

ఐటీ రిటర్న్‌లకు గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో.. మరికొంత కాలం పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 

Published : 28 Dec 2021 19:35 IST

 ట్విటర్‌ ట్రెండింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐటీ రిటర్న్‌లకు గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో.. మరికొంత కాలం పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో #Extend_Due_Date_Immediately హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. వాస్తవానికి 2021-22 అసెస్‌మెంట్‌ ఇయార్‌కు సంబంధించిన పన్ను చెల్లించేందుకు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. కానీ, కొవిడ్‌ వ్యాప్తి, ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వం దానిని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఐటీ సమస్యలను దెప్పిపొడుస్తూ ట్వీట్లు చేశారు. డిసెంబర్‌ 31 అనే తుదిగడువు పోర్టల్‌ డెవలపర్లకే గానీ.. పన్ను చెల్లింపుదార్లకు మాత్రం సరిపోదని పేర్కొన్నారు. మరికొందరు  ఐటీ పోర్టల్‌ సమస్యలను స్క్రీన్‌ షాట్లు తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. 

మరో పక్క ఆదాయపు పన్నుశాఖ డిసెంబర్‌ 27 వరకు 4,67,45,249 మంది ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేసినట్లు పేర్కొంది. నిన్న ఒక్క రోజే 15 లక్షల మందికి పైగా రిటర్నులు దాఖలు చేసినట్లు వెల్లడించింది. అవసరమైన అదనపు సాయంకోసం  orm@cpc.incometax.gov.inలో సంప్రదించాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ ఫైలింగ్‌కు డిసెంబర్‌ 31న తుదిగడువు కాగా.. లేట్‌ ఫైలింగ్‌ ఫీజుతో చెల్లంచడానికి మార్చి 2022 మార్చి 31 వరకు గడువు ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని