IT portal: ఐటీ పోర్టల్ను వదలని సమస్యలు.. ఈ ఫైలింగ్లో యూజర్లకు తప్పని పాట్లు!
IT portal: పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ను తీసుకొచ్చి ఏడాది గడిచినప్పటికీ బాలరిష్టాలు దాటడంలో ఇబ్బందులు పడుతూనే ఉంది.
దిల్లీ: పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ను తీసుకొచ్చి ఏడాది గడిచినప్పటికీ బాలరిష్టాలు దాటడంలో ఇబ్బందులు పడుతూనే ఉంది. ఐటీ రిటర్నుల దాఖలు వేళ.. ఈ పోర్టల్ మరోసారి యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ఐటీ శాఖ.. ఈ విషయాన్ని పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ‘‘ఐటీ శాఖకు చెందిన ఈ ఫైలింగ్ పోర్టల్ వినియోగంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లాం. అసాధారణ ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తాయని, తగిన చర్యలు తీసుకుంటోంది’’ అని ఐటీశాఖ ట్వీట్చేసింది.
కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ను 2021 జూన్ 7న తీసుకొచ్చారు. ఆ ఏడాది ఐటీ సైట్లో అనేక సార్లు సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు తుది గడువును పలుమార్లు పొడిగించాల్సి వచ్చింది. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలోనూ సెర్చ్ ఆప్షన్ సరిగా పనిచేయకపోవడంపై ఐటీ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఐటీ ఫైలింగ్ పోర్టల్ను రూపొందించే కాంట్రాక్ట్ను 2019లో ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.164.5 కోట్లు చెల్లించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ