TCS: ఆ ఆలోచనే రాజీనామాకు దారితీసింది: టీసీఎస్ సీఈఓ
TCS: చేసే పనిపై ఎప్పుడైతే తన మనసు పూర్తిగా కేంద్రీకృతం కాలేదో.. అప్పుడే ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని గోపీనాథన్ (TCS CEO) తెలిపారు.
ముంబయి: ఇంకా ఏదో చేయాలనే ఆలోచనలు తన మదిలో గత కొంత కాలంగా మెదులుతున్నాయని తాజాగా రాజీనామా చేసిన టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ (TCS CEO Rajesh Gopinathan) తెలిపారు. ఇదే విషయాన్ని టాటా సన్స్ ఛైర్మన్, తన మెంటార్ ఎన్.చంద్రశేఖరన్తో చర్చించినట్లు వెల్లడించారు. అయితే, కంపెనీని ఇంకా కొంతకాలం నడపడాన్నే ఇప్పటి వరకు ప్రాధాన్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడం కంటే సవాళ్లతో కూడుకున్న పని మరొకటి ఉండదని గోపీనాథన్ (TCS CEO) అన్నారు. గత పదేళ్లుగా తాను అదే పనిచేస్తున్నానని తెలిపారు. అది తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. అయితే, ఓ మైలురాయి దాటగానే.. ‘తర్వాతేంటి..?’ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. చేసే పనిపై ఎప్పుడైతే తన మనసు పూర్తిగా కేంద్రీకృతం కాలేదో.. అప్పుడే ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని గోపీనాథన్ (Rajesh Gopinathan) తెలిపారు. ఆ నిర్ణయమే తాను రాజీనామా చేయడానికి దారితీసిందన్నారు. తాను ఇప్పటి వరకు అలంకరించిన పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. అత్యంత నమ్మకంతో తాను ఆ బాధ్యతల్ని నిర్వర్తించానన్నారు. ఇక్కడ కూర్చొని భవిష్యత్తు ప్రణాళికల్ని రచించడం సరికాదని తాను భావించానన్నారు. గత 22 ఏళ్లుగా మరో ఆలోచన లేకుండా టీసీఎస్ కోసం పనిచేశానని తెలిపారు. తనలో కంపెనీ ఓ భాగమై పోయిందంటూ టీసీఎస్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
తర్వాత ఏం చేయాలో తాను ఇంకా నిర్ణయించుకోలేదని గోపీనాథన్ (Rajesh Gopinathan) తెలిపారు. అయితే, కొత్తగా ఎన్నికైన సీఈఓ కృతివాసన్కు బాధ్యతల్ని సాఫీగా బదిలీ చేయడమే తన తక్షణ కర్తవ్యమని తెలిపారు. కావాల్సినప్పుడు తాను కంపెనీకి కచ్చితంగా అందుబాటులో ఉంటానన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో వైదొలగుతుండడంపై స్పందిస్తూ.. గత పదేళ్లలో తనకు ఇదే అత్యంత స్థిరమైన కాలంగా కనిపిస్తోందన్నారు. ఇంతకంటే ఒడుదొడుకులు గతంలో చవిచూశామన్నారు. అలాంటి సమయంలో అందరం ఏకతాటిపై నిలబడి సమర్థంగా సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు.
కొత్త సీఈఓ బాధ్యతలు స్వీకరించగానే భారీ మార్పులు చేసే సంస్కృతి టీసీఎస్లో లేదని కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న కృతివాసన్ తెలిపారు. అయితే, చెన్నై నుంచి బయటకు వెళ్లడమే తనకు కాస్త ఇబ్బందికరమైన విషయమని సరదాగా వ్యాఖ్యానించారు. కస్టమర్ల అవసరాలను తీర్చడమే తమ తొలి కర్తవ్యమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్