TCS Q3 Results: టీసీఎస్‌ లాభం 11 శాతం వృద్ధి.. ఒక్కో షేరుపై ₹75 డివిడెండ్‌

TCS Q3 Results: ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ3లో లాభం 11 శాతం మేర వృద్ధి చెందింది.

Published : 09 Jan 2023 18:46 IST

ముంబయి: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) కంపెనీ నికర లాభం రూ.10,846 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.9,769 కోట్లతో పోలిస్తే 11 శాతం పెరగడం గమనార్హం.

కంపెనీ ఆదాయం సైతం 19.1 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.48,885 కోట్లుగా ఉంది. వలసలు సైతం 21.5 శాతం నుంచి 21.3 శాతానికి తగ్గినట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథ్‌ తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో 7.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించారు.

ఒక్కో  షేరుపై రూ.75 డివిడెండ్‌

ఈ సందర్భంగా వాటాదారులకు టీసీఎస్‌ డివిడెండ్‌ ప్రకటించింది. ఒక్కో షేరుపై స్పెషల్‌ డివిడెండ్‌ రూ.67తో కలుపుకొని మొత్తం రూ.75 డివిడెండ్‌ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు రికార్డు డేట్‌ను జనవరి 17గా కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 3న డివిడెండ్‌ చెల్లింపులు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు సోమవారం బీఎస్‌ఈలో 3.35 శాతం లాభపడి రూ.3,319.79 చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని