ఫోన్లలో ట్రూకాలర్ తరహా ఫీచర్.. టెలికాం కంపెనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ఫోన్ చేసిందెవరో తెలుసుకోవాలంటే ట్రూకాలర్ యాప్ ఉండాల్సిందే. ఇకపై యాప్తో పని లేకుండా ఐడెంటిఫికేషన్ ఫీచర్ను ట్రాయ్ తీసుకొస్తోంది. దీనిపై టెలికాం కంపెనీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
దిల్లీ: అవతలి నుంచి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలియాలంటే ట్రూకాలర్ వంటి థర్డ్పార్టీ యాప్ ఉండాల్సిందే. అలాంటి అవసరం లేకుండా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (Trai) కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. ఎలాంటి యాప్ సాయం లేకుండా అవతలి వ్యక్తి ఎవరనేది ఫోన్ డిస్ప్లేపై తెలిసిపోతుంది. ఇందుకోసం టెలికాం కంపెనీల వద్ద ఉండే రిజిస్ట్రేషన్ డేటాను వినియోగించాలని భావించింది. అయితే, దీనిపై టెలికాం కంపెనీలు ప్రతికూలంగా స్పందించాయి. కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ (CNAP) పేరుతో వస్తున్న ఈ ఫీచర్ వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. సాంకేతికంగా కొన్ని అవరోధాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో తమకున్న అభ్యంతరాలను జియో (Jio), ఎయిర్టెల్ (Airtel), బీఎస్ఎన్ఎల్ (BSNL), వొడాఫోన్ ఐడియా (Vi) వేర్వేరుగా తమ స్పందనను ట్రాయ్కు తెలియజేశాయి.
ఈ ఫీచర్ వల్ల డేటా గోప్యత, సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జియో తెలిపింది. చాలా వరకు ఫోన్లు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP)కి సపోర్ట్ చేయవని పేర్కొంది. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయని తన అభిప్రాయాన్ని ట్రాయ్కి తెలియజేసింది. దీనివల్ల నెట్వర్క్పై కూడా భారం పడుతుందని పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని ఎయిర్టెల్ తెలిపింది. కాల్ సెటప్ సమయం ఎక్కువగా తీసుకోవటంతో యూజర్లు అసంతృప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఫీచర్ కోసం వేరేగా స్టోరేజ్ను ఉంచాల్సి ఉంటుందని, టెల్కోలకు ఆ మేర భారం పడుతుందని తెలిపింది. కాలర్ ఐడీ ఫీచర్ని ఈ దశలో తప్పనిసరి చేయటం సరైనది కాదని ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఆరంభంలో ఈ సర్వీసుని వాల్యూ యాడెడ్ సర్వీసుగా అందించాలని పేర్కొంది. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ తరహాలోనే వొడాఫోన్ సైతం అభ్యంతరాలను తెలియజేసింది. ఎల్టీఈ నెట్వర్క్ ఫీచర్ అని, 2జీ, 3జీ నెట్వర్క్కు అనుసంధానం చేయడం సాధ్యంకాదని తెలిపింది. ఇందుకు నెట్వర్క్, ఐటీ సిస్టమ్స్ను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు