Telecom: 5జీ విస్తరణ.. టారిఫ్ల పెంపు.. 2023లో టెలికాం టార్గెట్!
2022లో అనేక సంస్కరణలు, 5జీ ప్రారంభాన్ని చూసిన టెలికాం రంగం 2023పై కొత్త ఆశలతో ముందుకెళ్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు భారత వృద్ధిలో కీలక పాత్ర పోషించిన టెలికాం రంగం తర్వాత కొన్నేళ్లకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అనేక సంస్థలు కకావికలమై వ్యాపారం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. తదనంతరం వచ్చిన అనేక సంస్కరణలతో పునరుజ్జీవం పోసుకొని స్థిరత్వం సాధించింది. 2022లో 5జీ (5G Nerwork) రాకతో కొత్త శకాన్ని ఆహ్వానించి ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. 5G సేవలతో ప్రజలను అనుసంధానించడం దగ్గరి నుంచి నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం వరకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా నెట్వర్క్లను విస్తరించడానికి రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని ఆకాంక్షిస్తోంది. వీటితో పాటే పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టారిఫ్ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.
కంపెనీల పెట్టుబడులు ఇలా..
ఇప్పటికే దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం వ్యాపారం జియో ద్వారా 5జీ నెట్వర్క్ విస్తరణ కోసం 2023 చివరినాటికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంట్లో రూ.87,946 కోట్లు స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.1.12 లక్షల కోట్లను పూర్తిగా 5జీ నెట్వర్క్ విస్తరణ, అనుసంధానం కోసం 2023లో వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు భారతీ ఎయిర్టెల్ రూ.27,000-28,000 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. అలాగే బీఎస్ఎన్ఎల్ 2023లో దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ విస్తరణకు రూ.16,000 కోట్లు కేటాయించనుంది. దీన్నే తదనంతరం 5జీకి అప్గ్రేడ్ చేయనుంది. మరో వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఇంకా తమ పూర్తిస్థాయి టెలికాం ప్రణాళికల్ని ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా 2023లో టెలికాం రంగం రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది.
2022లో అనేక సంస్కరణలు..
2022లో టెలికాం రంగంలో అనేక నిర్మాణాత్మక సంస్కరణలు వెలుగుచూశాయని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్.పి.కొచ్చర్ తెలిపారు. ఇ-కెవైసీ; స్పెక్ట్రమ్ వినియోగ రుసుముల తొలగింపు; ప్రత్యక్ష మార్గంలో 100 శాతం ఎఫ్డీఐ; బ్యాంకు గ్యారంటీలు, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు, వడ్డీరేట్లు, జరిమానాలు, రైట్ ఆఫ్ వే లాంటి అంశాల హేతుబద్ధీకరణ వంటి సంస్కరణలు 2022లో టెలికాం రంగంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అలాగే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సర్కార్ మార్గదర్శకాలకు అనుగుణంగా టెలికాం మౌలికవసతుల కల్పనకు అనువైన విధానాలను తీసుకొచ్చాయని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ టి.ఆర్.దువా తెలిపారు.
వారానికి 2,500 5జీ బేస్ స్టేషన్లు..
దేశంలో వారానికి 2,500 కొత్త 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటవుతున్నాయని ఇటీవల పార్లమెంటులో టెలికాం శాఖ సహాయ మంత్రి దేవూసిన్హా చౌహాన్ తెలిపారు. నవంబరు 26 నాటికి దేశవ్యాప్తంగా 20,980 మొబైల్ బేస్ స్టేషన్లు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు టెలికాం గేర్ తయారీ సంస్థలు నోకియా, ఎరిక్సన్ భారత్లో ఉత్పత్తి ప్రారంభించాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద 42 టెలికాం గేర్ తయారీ సంస్థలు రూ.4,115 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్