Ashwini Vaishnaw: టెలికాం శాఖలో 10 మంది సీనియర్ అధికారులపై అశ్వినీ వైష్ణవ్ వేటు
టెలికాం శాఖలో 10 మంది ఉన్నతోద్యోగులపై వేటు పడింది. పనితీరు సరిగా లేదన్న కారణంతో మంత్రి అశ్వనీ వైష్ణవ్ వీరిని తొలగించారు.
దిల్లీ: విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ పనితీరు సరిగా కనబరచని అధికారులపై టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) వేటు వేశారు. టెలికాం విభాగంలో (DoT officers) పనిచేస్తున్న 10 మంది సీనియర్ అధికారులను బలవంతపు రిటైర్మెంట్పై పంపించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో జాయింట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగి కూడా ఉన్నారని పేర్కొన్నాయి. మిగిలిన తొమ్మిది మంది డైరెక్టర్ స్థాయి అధికారులు అని తెలిసింది. విధుల్లో అవినీతి, చిత్తశుద్ధిపై అనుమానంతో వీరిని విధుల నుంచి తప్పించేందుకు మంత్రి ఆమోదం తెలిపారని సమాచారం.
పెన్షన్ నిబంధనలను అనుసరించి టెలికాం విభాగంలో ఒక ఉద్యోగిని ఇలా బలవంతంగా పదవీ విరమణపై పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు సెప్టెంబర్లో ఇలానే మంత్రి వైష్ణవ్ నిర్వహించిన సమావేశంలో బీఎస్ఎన్ఎల్కు చెందిన ఓ సీనియర్ అధికారి నిద్రపోవడంతో ఆయన చేత స్వచ్ఛంద పదవీ విరమణ చేయించారు. వైష్ణవ్ నిర్వహిస్తున్న రైల్వే శాఖలో సైతం ఇప్పటికే 40 మంది ఉద్యోగుల్ని ఇలానే ఇంటికి పంపించారు. పనితీరు సరిగాలేని, చిత్తశుద్ధి కనబరచని ఉద్యోగుల చేత బలవంతపు రిటైర్మెంట్ చేయించారు. వీరిలో సెక్రటరీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు స్పెషల్ సెక్రటరీ అధికారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా