Fuel Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే..
చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.
హైదరాబాద్: చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎక్సైజ్ సుంకంపై రాష్ట్రంలో వ్యాట్ తగ్గడంతో హైదరాబాద్లో పెట్రోల్పై రూ.6.33, డీజిల్పై 12.79 చొప్పున ఊరట కలిగింది. దీంతో గురువారం నగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. డీజిల్ రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది.
రూ.7 చొప్పున తగ్గించిన ‘భాజపా’ రాష్ట్రాలు
చమురు ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించిన క్రమంలోనే దేశంలోని పలు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఈ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. ఈ రెండు ఇంధనాలపై అస్సాం, మణిపుర్, త్రిపుర, గోవా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఫలితంగా కేంద్ర తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోలు రూ.12, డీజిల్ రూ.17 మేర చవక కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..