
Tesla in India: భారత్లో టెస్లా కార్ల విక్రయ ప్రయత్నాలకు బ్రేక్..!
టారిఫ్పై ప్రతిష్టంభన వీడకపోవడంతో సంస్థ నిర్ణయం
దిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లో అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దిగుమతి సుంకాలపై నెలకొన్న ప్రతిష్టంభన వీడకపోవడంతో భారత్లో టెస్లా కార్ల విక్రయించే ప్రణాళికకు విరామం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. టెస్లా కార్ల విక్రయంపై ఏడాదిగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ సఫలం కాలేకపోయింది. దీంతో షోరూంలు, సర్వీస్ సెంటర్ల కోసం స్థలాల అన్వేషణ ప్రయత్నాలను విరమించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కార్ల తయారీని భారత్లోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో అందుకు సిద్ధంగా లేని టెస్లా.. ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలకు దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీని అమెరికా, చైనా దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్లో దిగుమతి చేసి విక్రయించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్ను స్థానికంగా నెలకొల్పుతామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చెబుతూ వచ్చారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే, మేక్-ఇన్-ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోన్న భారత ప్రభుత్వం మాత్రం ఎలాన్ మస్క్ ప్రతిపాదనలకు అంగీకరించలేదు. ఎలక్ట్రిక్ కార్ల తయారీని భారత్లోనే చేపట్టాలని పలుమార్లు స్పష్టం చేయడంతో షోరూంలు, సర్వీస్ సెంటర్లకోసం ఆయా నగరాల్లో చేసిన ప్రయత్నాలను టెస్లా విరమించుకుంది.
వాస్తవానికి 2019లోనే టెస్లాను భారత విపణిలోకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావించారు. అయితే భారత్లో విద్యుత్ వాహనాల (ఈవీ) దిగుమతిపై 100శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడి ప్రభుత్వ నిబంధనలు, కొన్ని సవాళ్ల కారణంగానే టెస్లా రాక ఆలస్యమవుతోందని ఇటీవల సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. మస్క్ ఆరోపణలను ఖండించిన భారత ప్రభుత్వం.. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. ఇలా భారత్లో టెస్లా కార్ల విక్రయాలకు మస్క్ చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. తాత్కాలికంగా ఈ ప్రయత్నాలను విరమించుకునేందుకే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
-
India News
Union Cabinet: 63వేల PACSల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
General News
Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
-
Business News
GST: రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై తేలని నిర్ణయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్ను ఉమ్రాన్కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా