Tesla in India: భారత్లో టెస్లా ప్రతినిధుల పర్యటన.. ఎందుకో?
Tesla in India: భారత్లో టెస్లా ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కంపెనీకి చెందిన ప్రతినిధుల బృందం భారత్లో పర్యటించనుందని సమాచారం.
దిల్లీ: అత్యాధునిక టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, నాణ్యతతో కూడిన కార్లకు టెస్లా (Tesla) పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లకు ఉన్న క్రేజే వేరు. చైనా, అమెరికా మార్కెట్లలో వీటి హవా కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు భారత్లోకి మాత్రం ఇవి ప్రవేశించలేదు. మన దేశ రోడ్లపై వీటి ప్రయాణాన్ని ఆస్వాదించాలని చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ, ధర పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో భారత్లో టెస్లా ప్రవేశంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
టెస్లా (Tesla)కు చెందిన కొంతమంది సీనియర్ ఉన్నతోద్యోగులు ఈవారంలోనే భారత్లో పర్యటించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులతోనూ వీరు భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అయితే, దీనిపై ఇటు ప్రభుత్వం నుంచి కానీ, అటు టెస్లా (Tesla) నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
భారత్లో టెస్లా తమ కార్లను నేరుగా విక్రయించడం లేదు. అలాగే ఇక్కడ తయారీ కూడా చేపట్టడం లేదు. కానీ, కార్ల తయారీకి కావాల్సిన కొన్ని పరికరాలను మాత్రం భారత్ నుంచి సమకూర్చుకుంటోంది. దీన్ని మరింత విస్తరించే దిశగా తాజాగా చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్లో సోనా గ్రూప్ టెస్లా (Tesla)కు డిఫరెన్షియల్ గేర్లను అందిస్తోంది. అలాగే సంధార్ టెక్నాలజీస్ పలు ఇతర పరికరాలను అందిస్తోంది. అయితే, ఇది చాలా పరిమిత మొత్తంలో జరుగుతోంది.
పరిశ్రమ వర్గాలు మాత్రం టెస్లా (Tesla) ప్రతినిధుల రాకకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. టెస్లా ప్రతినిధులు కేవలం పరికరాల సేకరణ విస్తరణకు మాత్రమే పరిమితం కాకపోవచ్చునని భావిస్తున్నారు. భారత్లో ప్రవేశంపై ప్రస్తుతానికి నిలిచిపోయిన చర్చల్ని తిరిగి ప్రారంభించేందుకు ఇది నాంది కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్లోకి ప్రవేశించడానికి సంబంధించిన ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు 2022లో టెస్లా ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్లోకి దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లపై ప్రభుత్వం భారీ ఎత్తున సుంకం విధిస్తోంది. ‘కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రెయిట్’ విలువ 40,000 డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకం వర్తిస్తోంది. టెస్లా (Tesla) మోడళ్లన్నీ దాదాపు ఈ కేటగిరీలోకే వస్తున్నాయి. దీంతో పన్నులను తగ్గించాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ఇక్కడి ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత విక్రయాల తీరును బట్టి స్థానికంగా తయారీపై ఆలోచిస్తామని తెలిపారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇతర వాహన తయారీ సంస్థల తరహాలోనే టెస్లాను సైతం పరిగణిస్తామని తేల్చి చెప్పింది. భారత్లోనే తయారీని చేపట్టడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని.. అప్పుడు కార్లకు డిమాండ్ ఉంటుందని చెప్పింది. కనీసం విడి భాగాలుగా తీసుకొచ్చి భారత్లో అసెంబుల్ చేసే విధానం (CKD)పైనైనా దృష్టి సారించాలని టెస్లా (Tesla)కు భారత ప్రభుత్వం సూచించింది.
ప్రస్తుతం మెర్సిడెస్, ఫోక్స్వ్యాగన్ వంటి దిగ్గజ సంస్థలు సీకేడీ విధానంలోనే తమ కార్లను భారత్లో విక్రయిస్తున్నాయి. టెస్లా (Tesla) సైతం ఈ విధానాన్ని అవలంబించాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సీట్లు, టైర్లు, గ్లాసులు, అంతర్గత ఫిట్టింగులు స్థానికంగానే సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. దీని వల్ల తయారీ ఖర్చు గణనీయంగా తగ్గతుందని తెలిపారు. మరోవైపు సుంకాల తగ్గింపు విషయంలో టెస్లా (Tesla)కు ప్రత్యేక మినహాయింపునిచ్చే అంశాన్ని దేశీయ వాహన తయారీ కంపెనీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల మేకిన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందని వాదిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!