Festive Sale: పండగ వేళ రూ.2.60 లక్షల కోట్ల వ్యాపారం..!
ఈ పండగ సీజన్ సందర్భంగా ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి రూ.10,000 వరకు ఖర్చు చేయొచ్చని లోకల్సర్కిల్స్ సర్వే అంచనా వేసింది....
లోకల్సర్కిల్స్ సర్వే అంచనా
ఇంటర్నెట్ డెస్క్: ఈ పండగ సీజన్ సందర్భంగా ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం రూ.10,000 వరకు ఖర్చు చేయొచ్చని లోకల్సర్కిల్స్ సర్వేలో తేలింది. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య ఈసారి 20 శాతం పెరిగిందని సర్వే ఆధారిత నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసారి పండగ వ్యాపారం 32 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.60 లక్షల కోట్లు)కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్లో చాలామంది పండగల సందర్భంగా కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కొత్త వస్తువుల కొనుగోళ్లకు పండగలను శుభ సమయంగా భావించడం ఒక కారణమైతే.. దుకాణాలు, షాపింగ్ కేంద్రాలు ప్రత్యేక రాయితీలు ప్రకటించడం కూడా వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో 58,000 మంది పాల్గొన్నారు.
సర్వేలోని కీలక అంశాలు..
☛ సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 35 శాతం మంది ఈ పండగ సీజన్లో ఎలాంటి కొనుగోళ్లు చేయబోమని తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి కోల్పోవడమే దీనికి కారణంగా తెలిపారు.
☛ ఫెస్టివ్ సేల్లో పాల్గొంటామని చెప్పిన కుటుంబాల్లో 3 శాతం రూ.లక్షకు పైగా; 9 శాతం రూ.50,000-1,00,000; 15 శాతం రూ.20,000-50,000; 6 శాతం రూ.10,000-20,000; 17 శాతం రూ.5,000-10,000; 9 శాతం కుటుంబాలు రూ.2,000 వరకు ఖర్చు చేస్తామని తెలిపాయి.
☛ దాదాపు 31 శాతం కుటుంబాలు ధరకు తగ్గ విలువ ఉండే వస్తువులను కొనుగోలు చేస్తామని చెప్పగా.. మరో 31 శాతం నాణ్యమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. మరో 16 శాతం మంది తమ వసతిని బట్టి కొంటామని పేర్కొన్నారు.
☛ 49 శాతం మంది షాపింగ్ మాళ్లు, దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తామని తెలిపారు. మరో 38 శాతం మంది ఇ-కామర్స్ ద్వారా కొంటామని పేర్కొన్నారు. మరో 10 శాతం మంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
☛ గత ఏడాది పండగ సీజన్లో దాదాపు 39 శాతం మంది ఇ-కామర్స్ వేదికలుగా షాపింగ్ చేస్తే.. ఈసారి ఆ సంఖ్య 33 శాతానికి తగ్గనుంది.
☛ 35 శాతం మంది దీపావళికి సంబంధించిన దీపాలు, కొవ్వొత్తులు, లైటింగ్ వస్తువులు, పూలు ఇతరత్రా కొనుగోలు చేస్తామని తెలిపారు. మరో 26 శాతం మంది పండగ సీజన్ ప్రత్యేకమైన గిఫ్ట్ ప్యాక్లు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు, తాజా పండ్లు, స్వీట్లు.. తదితరాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. 12 శాతం మంది దుస్తులు, కాస్మొటిక్స్, పాదరక్షలు, బ్యాగుల వంటి ఫ్యాషన్ వస్తువులను కొంటామని తెలిపారు. మరో 12 శాతం ఇంటి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఫర్నీచర్, అలంకరణ, రంగులు, శానిటరీవేర్, లైటింగ్.. వంటి వస్తువులు కొనుగోలు చేస్తామన్నారు.
☛ కేవలం ఆరు శాతం మంది మాత్రమే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి వైట్ గూడ్స్, స్మార్ట్ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొననున్నామని తెలిపారు. 4 శాతం మంది ఆభరణాలు, మరో 4 శాతం వాహనాలు కొంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్