Car Sales: ఈ కార్ల విక్రయాలు ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోనున్నాయా?
ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉన్న కొత్త ఉద్గార ప్రమాణాల (RDE norms)కు అనుగుణంగా తీర్చిదిద్దలేని కార్ల విక్రయాల (Car Sales)ను సంస్థలు నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 1 నుంచి కార్ల తయారీ కంపెనీలు మరింత కఠినమైన బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంది. ‘రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE norms)’ ప్రమాణాల పేరిట వీటిని తీసుకురానున్నాయి. అంటే వాహనాలు ఎప్పటికప్పుడు కొత్త ఉద్గారాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేలా రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అన్ని కార్ల మోడళ్లను కొత్త ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం కుదరదు. అలాంటి కార్ల విక్రయాల (Car sales)ను కంపెనీలు ఏప్రిల్ 1 తర్వాత నిలిపివేయక తప్పని పరిస్థితి.
★ రెనో ఇండియా (Renault India) తమ కార్ల మోడళ్లన్నింటినీ ఆర్డీఈ (RDE norms) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తామని ప్రకటించింది. అయితే, క్విడ్ (KWID) 800 సీసీ వెర్షన్ను మాత్రం కొత్త ప్రమాణాల ప్రకారం తీర్చిదిద్దడం కష్టమని తెలిపింది. ఇప్పటికే దీని తయారీని నిలిపివేసింది. దీని స్థానంలో రూ.4.69 లక్షల (ఎక్స్షోరూం) ప్రారంభ ధరతో క్విడ్ (KWID)లోనే ఆర్ఎక్స్ఈ వేరియంట్ను తీసుకొచ్చింది.
★ హోండా కార్స్ (Honda Cars) ఇండియా నెమ్మదిగా అమేజ్ (Amaze) డీజిల్ వేరియంట్ కారు విక్రయాలను నిలిపివేసింది. కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా దీన్ని తొలగించింది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తోన్న అమేజ్ (Amaze)ను కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం కుదరదని గతంలోనే హోండా కార్స్ ప్రకటించింది. పైగా పెట్రోల్ వేరియంట్కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అమేజ్ (Amaze) డీజిల్ వేరియంట్ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే డబ్ల్యూఆర్-వీ, జనరేషన్ 4 సిటీ, జాజ్ తయారీని సైతం హోండా నిలిపివేయనున్నట్లు తెలిపింది.
★ హ్యుందాయ్ ఇండియా ఐ20 (Hyundai i20) డీజిల్ మోడల్ విక్రయాలను నిలిపివేసే అవకాశం ఉందని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే గ్రాండ్ ఐ10 నియోస్లో డీజిల్ వేరియంట్ల తయారీని హ్యుందాయ్ నిలిపివేసింది. ఆరా (Aura)లోనూ డీజిల్ వేరియంట్కు స్వస్తి పలికే అవకాశం ఉందని సమాచారం.
★ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా సైతం తమ కార్ల మోడళ్లలో కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దలేని వాటిని నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కంపెనీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఆల్టో 800, ఇగ్నిస్, సియాజ్ మోడళ్లు ఏప్రిల్ 1 తర్వాత విక్రయానికి అందుబాటులో ఉండకపోవచ్చని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
★ మహీంద్రా అండ్ మహీంద్రాలో అల్టురాస్ జీ4కు ఆదరణ తగ్గిన విషయం తెలిసిందే. డిసెంబరులో ఈ వేరియంట్ కారు ఒక్కటి కూడా విక్రయం కాలేదు. తాజాగా ఆర్డీఈ ప్రమాణాలను అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వీటి తయారీని కంపెనీ ఇప్పటికే నిలిపివేసింది.
★ స్కోడా ఆటో ఇండియా సైతం ఆక్టేవియా, సూపర్బ్ మోడళ్లను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.
భారీ డిస్కౌంట్లు..
విక్రయాలు నిలిచిపోనున్న కార్ల స్టాక్ను వేగంగా పూర్తి చేసేందుకు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. నేరుగా నగదు రాయితీలతో పాటు ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ డిస్కౌంట్ పేరిట కారు అసలు ధరలో 10-11 శాతం వరకు తగ్గింపు లభిస్తోందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం