Refurbished Electronics: రీఫర్బిష్డ్ వస్తువుల్ని కొంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
ధర తక్కువున్నంత మాత్రాన రీఫర్బిష్డ్ వస్తువుల్ని తొందరపడి కొనొద్దు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఆశించిన స్థాయిలో అది పనిచేయకపోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బు ఆదా చేసుకోవడంలో భాగంగా కొంతమంది రీఫర్బిష్డ్ అంటే పునరుద్ధరించిన లేదా మరమ్మతు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను కొంటుంటారు. ఒక్కోసారి మనం కావాలనుకున్న పరికరం మార్కెట్లో అందుబాటులో లేకపోయినా ఇలాంటి ఉత్పత్తుల్ని కొనాల్సి వస్తుంటుంది. అయితే, ఇలా ఒకసారి మరమ్మతు చేసిన వస్తువుల్ని కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కంటే ముందే దాన్ని ఇంకొకరు ఉపయోగించిన నేపథ్యంలో దాని స్థితిని తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. మరి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ కొనే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటో చూద్దాం..
మరమ్మతు చేసిందా లేక ఓపెన్-బాక్స్ రిటర్నా?
కొంతమంది ఏదైనా వస్తువును ఆర్డర్ చేసిన తర్వాత కేవలం ప్యాకింగ్ ఓపెన్ చేసి వెంటనే రిటర్న్ చేస్తుంటారు. ఇలా ఉపయోగించకుండానే తిప్పి పంపిన వస్తువులను ఓపెన్-బాక్స్ రిటర్న్ ప్రోడక్ట్స్ అంటుంటారు. వస్తువులో ఎలాంటి లోపాలు లేకపోయినప్పటికీ.. వినియోగదారుడికి నచ్చకపోవడం వల్లనో లేక ప్యాకింగ్తో కస్టమర్ సంతృప్తి చెందకపోవడం వల్లనో దాన్ని రిటర్న్ చేస్తుంటారు. అలాంటి వాటిని తిరిగి కొత్త వస్తువులుగా అమ్మడానికి వీలుండదు. అదే రీఫర్బిష్డ్ అంటే.. పరికరంలో ఉన్న లోపాన్ని సరిచేసి తిరిగి విక్రయిస్తారు. అందుకే కొనేముందు విక్రేతల్ని ఓపెన్-బాక్స్ రిటర్న్ వస్తువులున్నాయేమో ఆరా తీయండి. రీఫర్బిష్డ్ కంటే ఇవి ఉత్తమం. అయితే, అది ఓపెన్-బాక్స్ రిటర్న్ అని మీరు గుర్తించగలగాలి. అలాగే దానికి కావాల్సిన ఆధారాల్ని అడిగి ధ్రువీకరించుకోవాలి.
ఎవరు పునరుద్ధరించారు?
తయారు చేసిన కంపెనీలే వస్తువుల్ని పునరుద్ధరించి రీఫర్బిష్డ్ కింద విక్రయిస్తుంటాయి. అలాంటి పరికరాలకు సరైన హామీ ఉండే అవకాశం ఉంటుంది. పైగా కావాల్సిన విడి భాగాలు వారి వద్ద అందుబాటులో ఉంటాయి గనుక నాణ్యత విషయంలోనూ ఢోకా ఉండదు. యాపిల్, డెల్, శాంసంగ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు రీఫర్బిష్డ్ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నాయి. థర్డ్ పార్టీ కంపెనీలు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి విక్రయిస్తుంటాయి. అయితే, ఇవి ఎంత వరకు నమ్మదగినవో చూసుకోవాలి. కొంత తక్కువే ధరకే లభిస్తున్నప్పటికీ.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.
అన్నీ ఉన్నాయా?
మీరు ఒక రీఫర్బిష్డ్ ఫోన్ కొంటున్నారంటే ఛార్జర్, ఇయర్ బడ్స్ కూడా దాంతో పాటే రావాలి. లేదంటే వాటిని సపోర్ట్ చేసే విడిభాగాలు బయట దొరక్కపోవచ్చు. లేదై ఏమైనా లోపం ఉండడం వల్ల వాటిని విక్రేతలు అందించకపోయి ఉండొచ్చు. అందుకే మనం ఏ వస్తువును ఆర్డర్ చేసినా.. దానికి కావాల్సిన విడిభాగాలు కూడా అందేలా చూసుకోవాలి. ఆర్డర్ చేయడానికి ముందే విక్రేతల నుంచి దీనికి సంబంధించి సరైన హామీని తీసుకోవాలి. అన్ని ఉంటాయంటేనే కొనాలి. అయితే, ఐఫోన్ వంటి ఓపెన్-బాక్స్ రిటర్న్ ఉత్పత్తులకు ఛార్జర్, ఇయర్ బడ్స్ వంటివి రాకపోవచ్చు.
వారెంటీ ఉందా?
మరమ్మతు చేసి కొత్తగా పునరుద్ధరించిన వస్తువులకు సైతం వారెంటీ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆశించినంత కాలం అవి పనిచేయకపోవచ్చు. కొన్నిసార్లు వస్తువును కొత్తగా కొన్నప్పుడు వచ్చిన వారెంటీతోనే రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ను ఇచ్చేస్తుంటారు. అంటే కొత్త వస్తువు 5 ఏళ్ల వారెంటీతో వచ్చిందనుకుందాం. దాన్ని మూడేళ్ల తర్వాత రీఫర్బిష్డ్ చేస్తే మరో రెండేళ్ల వారెంటీతో తిరిగి విక్రయిస్తారు. కానీ, ఇలా ఒకసారి మరమ్మతు చేసిన వాటికి కంపెనీ వారెంటీ వర్తించకపోవచ్చు. కొత్తగా రీఫర్బిష్ చేసిన తర్వాత కూడా సదరు కంపెనీయే వారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు వారెంటీ లేకుండా ఉన్న వస్తువులను కొనకపోవడమే ఉత్తమం. మీరు కొన్నప్పుడు అవి బాగానే పనిచేస్తున్నా.. కొంతకాలం తర్వాత మొరాయించే అవకాశం ఉంది.
ఏ స్థితి నుంచి పునరుద్ధరించారు?
రీఫర్బిష్డ్ ఉత్పత్తుల్ని విక్రయించేటప్పుడు అన్ని కంపెనీలు చెప్పే మాట.. కొత్త వాటిలా తీర్చిదిద్దామని. అంత వరకు బాగానే ఉన్నా.. అసలు ఏ స్థితి నుంచి దాన్ని కొత్తగా తీర్చిదిద్దారో తెలుసుకోవాలి. పూర్తిగా పాడైన వస్తుల్ని పునరుద్ధరించారా? లేక కేవలం ఫిజికల్ డ్యామేజ్ అయిన పార్ట్స్ని మార్చి విక్రయిస్తున్నారా? వంటి వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు.. ఓ మూడేళ్లు వాడిన ఫోన్ స్క్రీన్ పగిలిపోయిందనుకుందాం. దాన్ని వినియోగదారుడు కేవలం ఆ ఒక్క సమస్యతోనే విక్రయించేస్తాడు. కంపెనీలు ఆ స్క్రీన్ను మార్చేసి రీఫర్బిష్డ్ కింద అమ్మేస్తుంటాయి. కానీ, అప్పటికే మూడేళ్ల పాటు వినియోగించినందున లోపలి విడి భాగాల పనితీరు కూడా దెబ్బతిని ఉండొచ్చు. అందుకే ఏ స్థాయి నుంచి దాన్ని పునరుద్ధరించారనేది తెలుసుకుంటే మనకు ప్రోడక్ట్స్ లైఫ్పై ఓ స్పష్టత ఉంటుంది.
రిటర్న్ పాలసీ ఏంటి?
కొత్త వస్తువుల తరహాలోనే రీఫర్బిష్డ్ వాటిని సైతం రిటర్న్ చేయాల్సి రావొచ్చు. ఒకవేళ మీరనుకున్న స్థాయిలో ప్రోడక్ట్ లేకపోతే తిప్పిపంపక తప్పదు. అందుకే రిటర్న్ పాలసీని ముందే తెలుసుకోవాలి. అసలు రిటర్న్ తీసుకుంటారా? ఎన్ని రోజుల వరకు రిటర్న్ అవకాశం ఇస్తారు? వంటి వివరాలు తెలుసుకోవాలి.
ఇలాంటివి కొనకపోవడమే మంచిది!
నేరుగా శరీరాన్ని తాకే హెడ్ఫోన్లు, ఇయర్బడ్స్ వంటి వాటిని ఆరోగ్యరీత్యా కొనకపోవడమే ఉత్తమం. కీబోర్డ్స్, మౌస్ల వంటి స్వల్పకాల లైఫ్ ఉండే వాటిని సైతం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. హార్డ్ డ్రైవ్లను సైతం కొనొద్దు. వాటిని పూర్వస్థితికి అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్కి రీసెట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. రీఫర్బిష్డ్ టీవీలను కూడా కొనొద్దని నిపుణుల సూచన. అవి ఎంత పాతవో చెప్పడం అంత సులభం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ