Stock Market Update: మార్కెట్లను ముంచిన రేట్ల పెంపు
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో చలిస్తున్నాయి...
ముంబయి: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో చలిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాలను కఠినతరం చేస్తుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా ఫ్యూచర్స్ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా మధ్యాహ్నం 1:38 గంటల సమయానికి సెన్సెక్స్ 807 పాయింట్లు కోల్పోయి 54,894 వద్ద.. నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 16,438 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.77 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఎస్బీఐ షేర్లు మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడువుతున్నాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలివే..
అంతర్జాతీయంగా అమ్మకాలు: అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు అక్కడి మదుపర్లను అప్రమత్తం చేశాయి. నాస్డాక్ 2020 తర్వాత గురువారం అత్యధిక ఒకరోజు నష్టాన్ని నమోదు చేసింది. ఫెడ్ అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో చివర్ల్లో మార్కెట్లు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్, ఐరోపా సూచీలకు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
వడ్డీరేట్ల పెంపు: ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల కేంద్ర బ్యాంకులకు అనుగుణంగా ఆర్బీఐ సైతం వడ్డీరేట్లను పెంచింది. రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆందోళనకర స్థాయిలో ఉండే అవకాశం ఉందన్న అంచనాలే ఆర్బీఐ అనూహ్య నిర్ణయానికి కారణమని సమాచారం. మరోవైపు సీఆర్ఆర్ను సైతం 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ నెలాఖరు నాటికి ఆర్థిక వ్యవస్థ నుంచి దాదాపు రూ.80 వేల కోట్ల నగదును చలామణి నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మరోవైపు గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను ఒకశాతం పెంచాయి. అంతకుముందు ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంకు సైతం వడ్డీరేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
సురక్షిత మార్గాల వైపు మదుపర్లు: ద్రవ్యోల్బణం తగ్గే సూచనలు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు అంచనాలను రేటింగ్ సంస్థలు తగ్గిస్తున్నాయి. దీంతో అధిక రిస్కు ఉండే పెట్టుబడి మార్గాల నుంచి మదుపర్లు నిష్క్రమిస్తున్నారు. బాండ్ల వంటి సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ