Apple job: యాపిల్లో ఉద్యోగానికి ఈ నాలుగు లక్షణాలూ ఉండాల్సిందేనట!
యాపిల్ సంస్థలో ఉద్యోగంలో చేర్చుకునే వ్యక్తిలో ముఖ్యంగా నాలుగు లక్షణాలూ చూస్తామంటున్నారు ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్.
ఇంటర్నెట్ డెస్క్: ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకునే విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో తీరున వ్యవహరిస్తుంది. ఒక కంపెనీ వ్యక్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మరో కంపెనీ అతడి గుణగణాలను చూస్తుంది. ఇంకో కంపెనీ కేవలం అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచంలోనే టాప్ కంపెనీ అయిన యాపిల్ మాటకొస్తే.. తమ సంస్థలో ఉద్యోగం ఇచ్చే ముందు ఆ వ్యక్తిలో ముఖ్యంగా నాలుగు లక్షణాలూ చూస్తామంటున్నారు ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. ఇటీవల ఇటలీకి చెందిన ఓ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యాపిల్ కంపెనీలో పనిచేసేందుకు ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలను బయటపెట్టారు.
యాపిల్ ఉద్యోగులను నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తిలో కలిసి పనిచేసే తత్వం (collaborate), సృజనాత్మకత (creativity), తపన (curiosity), నైపుణ్యం (expertise) వంటి నాలుగు లక్షణాలూ ఉన్నాయో లేదో పరిశీలిస్తామని టిమ్ కుక్ చెప్పారు. తొలుత నలుగురితో కలిసి పనిచేయగలిగే గుణం ఉందో లేదో పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే యాపిల్ ఉత్పత్తులన్నీ పరస్పర సహకారంతో రూపొందుతుంటాయన్నారు. ఏదైనా ఆలోచనను నలుగురితో పంచుకున్నప్పుడు.. భిన్న అభిప్రాయాల ద్వారా అది మెరుగైన ఆలోచనగా మారుతుందని టిమ్ కుక్ చెప్పారు. పరస్పర సహకారంతోనే యాపిల్ తమ ఉత్పత్తులను తయారుచేస్తోందన్నారు. మిగిలిన మూడు లక్షణాలూ కావాలంటే నలుగురితో కలిసి పనిచేయడం ముఖ్యమని చెప్పారు.
ఇక యాపిల్ తన అభ్యర్థులు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించేవారై ఉండాలని కోరుకుంటుందని టిమ్ కుక్ చెప్పారు. ఏదైనా సమస్యను పరిష్కరించేటప్పుడు ఒకే సిద్ధాంతానికి పరిమితమైపోకూడదని అన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నలు అడిగినట్లు ఎప్పుడూ ఏదో కొత్తగా తెలుసుకోవాలన్న తపన ఉద్యోగుల్లో ఉండాల్సిందేనన్నారు. కలుపుగోలుతనం, సృజనాత్మకత, తపన ఈ మూడు.. కొత్త ఆలోచనలకు బీజం వేస్తాయని చెప్పారు. ఇక చివరగా వ్యక్తిలో చూసేది నైపుణ్యం అని టిమ్ కుక్ పేర్కొన్నారు. పైన పేర్కొన్న నాలుగు లక్షణాలూ యాపిల్లో పరస్పర పని సంస్కృతికి దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే యాపిల్ విజయానికి కారణమని అక్కడున్న విద్యార్థులకు టిమ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.