Apple job: యాపిల్లో ఉద్యోగానికి ఈ నాలుగు లక్షణాలూ ఉండాల్సిందేనట!
యాపిల్ సంస్థలో ఉద్యోగంలో చేర్చుకునే వ్యక్తిలో ముఖ్యంగా నాలుగు లక్షణాలూ చూస్తామంటున్నారు ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్.
ఇంటర్నెట్ డెస్క్: ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకునే విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో తీరున వ్యవహరిస్తుంది. ఒక కంపెనీ వ్యక్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మరో కంపెనీ అతడి గుణగణాలను చూస్తుంది. ఇంకో కంపెనీ కేవలం అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచంలోనే టాప్ కంపెనీ అయిన యాపిల్ మాటకొస్తే.. తమ సంస్థలో ఉద్యోగం ఇచ్చే ముందు ఆ వ్యక్తిలో ముఖ్యంగా నాలుగు లక్షణాలూ చూస్తామంటున్నారు ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. ఇటీవల ఇటలీకి చెందిన ఓ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యాపిల్ కంపెనీలో పనిచేసేందుకు ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలను బయటపెట్టారు.
యాపిల్ ఉద్యోగులను నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తిలో కలిసి పనిచేసే తత్వం (collaborate), సృజనాత్మకత (creativity), తపన (curiosity), నైపుణ్యం (expertise) వంటి నాలుగు లక్షణాలూ ఉన్నాయో లేదో పరిశీలిస్తామని టిమ్ కుక్ చెప్పారు. తొలుత నలుగురితో కలిసి పనిచేయగలిగే గుణం ఉందో లేదో పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే యాపిల్ ఉత్పత్తులన్నీ పరస్పర సహకారంతో రూపొందుతుంటాయన్నారు. ఏదైనా ఆలోచనను నలుగురితో పంచుకున్నప్పుడు.. భిన్న అభిప్రాయాల ద్వారా అది మెరుగైన ఆలోచనగా మారుతుందని టిమ్ కుక్ చెప్పారు. పరస్పర సహకారంతోనే యాపిల్ తమ ఉత్పత్తులను తయారుచేస్తోందన్నారు. మిగిలిన మూడు లక్షణాలూ కావాలంటే నలుగురితో కలిసి పనిచేయడం ముఖ్యమని చెప్పారు.
ఇక యాపిల్ తన అభ్యర్థులు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించేవారై ఉండాలని కోరుకుంటుందని టిమ్ కుక్ చెప్పారు. ఏదైనా సమస్యను పరిష్కరించేటప్పుడు ఒకే సిద్ధాంతానికి పరిమితమైపోకూడదని అన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నలు అడిగినట్లు ఎప్పుడూ ఏదో కొత్తగా తెలుసుకోవాలన్న తపన ఉద్యోగుల్లో ఉండాల్సిందేనన్నారు. కలుపుగోలుతనం, సృజనాత్మకత, తపన ఈ మూడు.. కొత్త ఆలోచనలకు బీజం వేస్తాయని చెప్పారు. ఇక చివరగా వ్యక్తిలో చూసేది నైపుణ్యం అని టిమ్ కుక్ పేర్కొన్నారు. పైన పేర్కొన్న నాలుగు లక్షణాలూ యాపిల్లో పరస్పర పని సంస్కృతికి దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే యాపిల్ విజయానికి కారణమని అక్కడున్న విద్యార్థులకు టిమ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.