Budget 2023: కేంద్ర బడ్జెట్ - 2023లో ముఖ్యమైన 15 పాయింట్లు ఇవే!
కేంద్ర బడ్జెట్ (Union Budget 2023)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్లో ముఖ్యమైన పాయింట్లు ఇవీ...
ఇంటర్నెట్ డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget 2023)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్లో ప్రతిపాదించిన, వెల్లడించిన ముఖ్యమైన పాయింట్లు మీ కోసం...
- సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం - రైతులు ప్రధాన భూమికగా ఈ ఏడు అంశాలు ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్ కాలేజ్లకు అనుమతి. 13 రకాలకుపైగా గుర్తింపు కార్డులకు బదులు పాన్ (PAN) ఒక్కటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రైల్వేల అభివృద్ధికి రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పీఎం ఆవాస్ యోజన పథకానికి నిధులు పెంపు. గతేడాది రూ.48 వేల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.79వేల కోట్లకు పెంపుదల.
- కర్ణాటక అప్పర్ భద్ర పథకానికి రూ.5,300 కోట్లు కేటాయింపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మహిళల కోసం సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. రెండేళ్ల కాలానికి తీసుకొస్తున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో... డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు. రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితి రూ.30లక్షలకు పెంపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఉన్నవారికి ఆదాయపు పన్ను రిబేట్ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. దీంతో వాటి ధరలు పెరుగుతాయి. టైర్లు, సిగరెట్ల ధరలూ పెరిగే అవకాశం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహన ధరలు . టీవీలు, మొబైల్, కిచెన్ చిమ్నీ, కెమెరాలు, లెన్స్, దిగుమతి చేసుకునే బంగారం ధరలు తగ్గుదల. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎంఎస్ఎంఈలకు ముందస్తు పన్ను రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంపు.
- మొత్తంగా కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 5జీ ప్రోత్సాహకానికి యాప్ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చిరుధాన్యాల (శ్రీ అన్న) కేంద్రంగా భారత్. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని పెంచడం కోసం పీఎం-ప్రణామ్. వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థల కోసం ప్రత్యేక నిధి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
Dell: టెక్ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఈ తరుణంలో డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. -
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
Adani group: అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని వస్తున్న వార్తలే ఇందుకు కారణం. -
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
Jio - IPL: ఐపీఎల్ వీక్షించాలనుకునేవారికి జియోలో రెండు అనువైన డేటా ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం..! -
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
స్టీవ్ జాబ్స్లా బహిరంగ సమావేశాల్లో సహజంగా వ్యవహరించలేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. -
Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం
Uber: ఉబర్ వల్ల ఉపాధి కోల్పోయామంటూ కోర్టును ఆశ్రయించిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. -
Stock Market: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,000
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతోంది. -
స్మాల్క్యాప్ ప్రకంపనలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్మాల్క్యాప్ షేర్లు దూసుకెళ్లాయి. గత నెలరోజుల వ్యవధిలో మాత్రం ఇవి మదుపర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 24% లాభపడితే, స్మాల్క్యాప్ సూచీ 71% దూసుకెళ్లడం గమనార్హం. -
అదానీ గ్రూప్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. -
ఫెడ్ వ్యాఖ్యలు కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఊగిసలాటకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం మీద మార్కెట్లు సానుకూలంగానే ఉండొచ్చని అంటున్నారు. జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుండటమే ఇందుకు కారణం. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.66,022 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.66,502; రూ.66,822 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. -
72000- 72590 పాయింట్ల శ్రేణి కీలకం!
జీవనకాల తాజా గరిష్ఠాల నుంచి సూచీలు గతవారంలో వెనక్కి వచ్చాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల విలువలు బుడగల్లా ఉన్నాయని, మదుపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెబీ పేర్కొనడం ప్రతికూల ప్రభావం చూపింది. -
ఈ వారంలో 3 కొత్త ఐపీఓలు
ఈ వారం మూడు కంపెనీల ఐపీఓలు మదుపర్ల ముందుకు రానున్నాయి. ఇవి ప్రధాన విభాగంలోనివి కావు. చిన్న, మధ్య స్థాయి (ఎస్ఎంఈ) విభాగానికి చెందిన 3 కంపెనీలు మొత్తం రూ.86.8 కోట్లు సమీకరించనున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ విలువ రెండేళ్లలో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.41,000 కోట్లు) తగ్గింది. 2022 జనవరి 31కి సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది జనవరి చివరకు సంస్థ విలువ 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. -
Flipkart: ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్కు రూ.10,000 జరిమానా!
Flipkart: ఐఫోన్ ఆర్డర్ను ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్కార్ట్ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
-
Ashwin: బెన్స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: రవిచంద్రన్ అశ్విన్
-
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
-
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
-
Putin: గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు.. 24 ఏళ్లుగా అధికారంలోనే!
-
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్