Toyota Kirloskar: ఏప్రిల్‌ నుంచి టయోటా కిర్లోస్కర్‌ కార్లు మరింత ప్రియం

ఏప్రిల్‌ 1 నుంచి తమ వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ శనివారం తెలిపింది...

Updated : 26 Mar 2022 15:12 IST

దిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి తమ వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ శనివారం తెలిపింది. పెరిగిన ముడివస్తువుల ధరలు, సరకు రవాణా వ్యయాలు, మారకపు రేట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫార్చునర్‌, ఇన్నోవా క్రిస్టా వంటి ప్రజాదరణ ఉన్న కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ ధరల పెంపు విషయంలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి బాటలో పయనించింది. ఈ సంస్థలన్నీ ఏప్రిల్‌ 1 నుంచి ధరల్ని పెంచనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని